ఎంత పనిచేసిందబ్బా గొర్రె!
గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసినప్పటికీ దాన్ని తీసుకునే వీల్లేకుండా చేయడంతో కొందరు లబ్ధిదారులు నిరాశ చెందుతుండగా, దళారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.
మునుగోడు పరిధి అర్హుల ఖాతాలలో గొర్రెల పంపిణీ పథకం డబ్బు జమ
లబ్ధిదారులు తీసుకోకుండా ఆదేశాలు
దళారులకు కంటగింపుగా కొత్త మార్గదర్శకాలు
చౌటుప్పల్ గ్రామీణం, న్యూస్టుడే: గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేసినప్పటికీ దాన్ని తీసుకునే వీల్లేకుండా చేయడంతో కొందరు లబ్ధిదారులు నిరాశ చెందుతుండగా, దళారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ పథకం కింద గతంలో పశువైద్యుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు జీవాలను కొనుగోలు చేసి ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో మోసాలు జరిగినట్టు సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. పశువైద్యులు తమకు నాణ్యత లేని జీవాలు అంటగట్టినట్టు గొర్రెల సంఘం నేతలు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తొలిసారిగా మునుగోడు నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమచేసేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ ప్రకారం నియోజకవర్గంలో 7,600 మందిని అర్హులుగా గుర్తించి, రెండు విడతల్లో రూ.93.78 కోట్లు విడుదల చేసింది. వాస్తవంగా సదరు సొమ్మును పశుసంవర్ధకశాఖ నల్గొండ జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేయగా, ఆయన ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలలో జమచేశారు. అయితే ఆ సొమ్మును నేరుగా సదరు లబ్ధిదారులు తీసుకునే వీల్లేకుండా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ద్వారా స్థానిక బ్యాంకులకు ఆదేశాలు జారీచేశారు. ‘సొమ్ము ప్రభుత్వం జమ చేసిందనే సమాచారం మాత్రం బ్యాంకు ఖాతా ద్వారా లబ్ధిదారుడికి తెలుస్తుంది. ఆ వ్యక్తి గొర్రెలను కొనుగోలు చేసినప్పుడు, అమ్మిన వ్యక్తి ఖాతాకు ఆ సొమ్మును బదిలీ చేయాల్సి ఉంటుంది’ అని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ రాంచందర్ ‘ఈనాడు’కు చెప్పారు. పథకం అమలు విధివిధానాలు ఖరారైన తర్వాత ఈ డబ్బులు ఎలా చెల్లించాలనే దానిపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం మొదటి విడతలో గొర్రెలను పంపిణీ చేసినప్పుడు ఎక్కువ మంది దళారులు లబ్ధి పొందారు. రెండో విడతలో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారని తెలుసుకుని దళారులు రంగంలోకి దిగారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన వాటా సొమ్ము (రూ.43,754)ను వారి పేరుతో దళారులే చెల్లించి డీడీలు తీశారు. మొత్తం వ్యవహారాన్ని తామే నడిపించేలా, లబ్ధిదారుకు రూ.10-20 వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమచేయడం, ఆ సొమ్ము కూడా తీసుకునే వీల్లేకుండా చేయడంతో దళారులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది లబ్ధిదారులతో వారు గొడవలకు దిగుతున్నట్టు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!