పుట్టెడు దుఃఖంతో.. గారాలపట్టి పుట్టినరోజు

ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే ఆ చిన్నారిని విష జ్వరం పొట్టనపెట్టుకుంది. నెల రోజుల కిందట తిరిగిరాని లోకాలకు వెళ్లి కడుపుకోత మిగిల్చిన తమ కూతురిని ఆ దంపతులు తలచుకోని రోజంటూ లేదు.

Published : 07 Oct 2022 04:54 IST

సమాధి వద్ద విలపించిన కన్నపేగు

వెల్గటూరు, న్యూస్‌టుడే: ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపే ఆ చిన్నారిని విష జ్వరం పొట్టనపెట్టుకుంది. నెల రోజుల కిందట తిరిగిరాని లోకాలకు వెళ్లి కడుపుకోత మిగిల్చిన తమ కూతురిని ఆ దంపతులు తలచుకోని రోజంటూ లేదు. గురువారం తమ గారాల పట్టి పుట్టిన రోజు కావడంతో సమాధి వద్ద ఆ చిన్నారి జయంతి నిర్వహించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరుకు చెందిన కొప్పుల రాజు, రసజ్ఞ దంపతుల నాలుగేళ్ల కుమార్తె జ్ఞానన్వి గత నెల 8న విష జ్వరంతో మృతి చెందింది. గురువారం ఆమె పుట్టిన రోజు కావడంతో ఆ దంపతులు ఆమెను ఖననం చేసిన చోటికి కేక్‌ను తీసుకొని వెళ్లారు. అక్కడ కేక్‌ కోసి భారమైన హృదయంతో జయంతిని నిర్వహించారు. చిన్నారి జ్ఞానన్వి ఫొటోకు కేక్‌ తినిపిస్తూ తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని