ఈడీ విచారణకు హాజరైన గీతారెడ్డి, అనిల్‌కుమార్‌

మాజీ మంత్రి జె.గీతారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా నేత గాలి అనిల్‌కుమార్‌లు గురువారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట  హాజరయ్యారు.

Published : 07 Oct 2022 04:54 IST

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి జె.గీతారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌ జిల్లా నేత గాలి అనిల్‌కుమార్‌లు గురువారం దిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట  హాజరయ్యారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నిర్వహించే యంగ్‌ ఇండియన్‌ ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన అంశంలో వారిని ఈడీ అధికారులు విచారించారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని గీతారెడ్డి తెలిపారు. మళ్లీ విచారణకు ఎప్పుడు రావాలనే అంశంపై అధికారులు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆమె ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని