CI Nageswar Rao: సీఐ నాగేశ్వర్రావుపై వేటు
పోలీసు ప్రతిష్ఠకు మచ్చతెచ్చారనే కారణంతో హైదరాబాద్ మారేడుపల్లిలో ఇన్స్పెక్టర్గా చేసిన కొరట్ల నాగేశ్వర్రావును సర్వీసు నుంచి తొలగిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. మరి కొందరిపైనా వేటు వేసినట్టు పేర్కొంటూ సోమవారం సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు.
మహిళపై అత్యాచారం ఘటన నేపథ్యంలో డిస్మిస్
లైంగిక వేధింపుల కేసుల్లో మరో సీఐ, ఎస్ఐ తొలగింపు
రిజర్వ్ ఇన్స్పెక్టర్, అయిదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు సిబ్బందిపైనా చర్యలు
సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: పోలీసు ప్రతిష్ఠకు మచ్చతెచ్చారనే కారణంతో హైదరాబాద్ మారేడుపల్లిలో ఇన్స్పెక్టర్గా చేసిన కొరట్ల నాగేశ్వర్రావును సర్వీసు నుంచి తొలగిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీచేశారు. మరి కొందరిపైనా వేటు వేసినట్టు పేర్కొంటూ సోమవారం సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జులైలో వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఆయన తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదురుతిరిగిన బాధితురాలిని, ఆమె భర్తను కిడ్నాప్ చేసి కారులో శివార్లలోని తన ఫామ్హౌస్కు తీసుకెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తప్పించుకున్న బాధితురాలు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నాగేశ్వర్రావు అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. ఆయన్ను సస్పెండ్ చేయడంతోపాటు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల షరతులతో కూడిన బెయిల్పై మాజీ సీఐ విడుదలయ్యారు.
శాఖాపరమైన విచారణ కోసమేనా?
ఘటనను తెలంగాణ/నగర పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇన్స్పెక్టర్ హోదాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడం, శాఖకు మచ్చతెచ్చేలా వ్యవహరించడం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నందున నాగేశ్వర్రావుపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన బాధితులను బెదిరించడం, సాక్షులను ప్రభావితం చేయడం, విచారణ సజావుగా సాగకుండా ప్రతికూల పరిస్థితులు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఆర్టికల్ 311(2)(బీ),3 ప్రకారం సర్వీస్ రిమూవల్ కోరుతూ నగర సీపీ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. సీపీ లేఖను పరిగణనలోకి తీసుకున్న అథారిటీ మాజీ సీఐని సర్వీసు నుంచి తొలగించింది.
మహిళా కానిస్టేబుల్పై లైంగిక వేధింపులతో..
లాలాగూడ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాస్రెడ్డి.. మహిళా కానిస్టేబుల్ను లైంగికంగా వేధించినట్లు రుజువు కావడంతో సర్వీసు నుంచి తొలగించారు. ‘2020లో లాలాగూడ ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో అదే ఠాణాలో పనిచేస్తున్న తన పట్ల ఆయన అనుచితంగా ప్రవర్తించినట్టు, అర్ధరాత్రి సమయాల్లో వ్యక్తిగత వాట్సప్ నంబరుకు అసభ్యకర సందేశాలు పంపడం, వీడియో కాల్స్ చేయడం ద్వారా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆయనపై కేసు నమోదైంది. అప్పటి సీపీ అంజనీకుమార్ ఆయన్ను సస్పెండ్ చేశారు. కె.శ్రీనివాస్రెడ్డిని డిస్మిస్ చేస్తూ తాజాగా సీపీ ఆదేశాలు జారీచేశారు.
* ఓయూ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ప్రొబేషన్ ఎస్సై బి.నరసింహ తన బ్యాచ్మేట్(మహిళా ఎస్సై) పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు గతంలో కేసు నమోదైంది. పోలీసుశాఖ అంతర్గత విచారణలో బాధితురాలిని ఆయన వేధించినట్టు రుజువైంది. ప్రస్తుతం రెయిన్బజార్ ఠాణా ఎస్సైగా విధుల్లో ఉన్న ఆయన ప్రొబేెషన్ను టెర్మినేట్ చేస్తున్నట్లు సీపీ ఉత్తర్వులో పేర్కొన్నారు.
* ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్ను కూడా సర్వీసు నుంచి తొలగించారు.
* మద్యం మత్తులో బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన, హైదరాబాద్ నగర పరిధిలో పనిచేస్తున్న ఎస్సై కె.శ్యామ్, హత్య కేసుల్లో ప్రమేయం ఉన్న అయిదుగురు కానిస్టేబుళ్లనూ డిస్మిస్ చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు మినిస్టీరియల్ ఉద్యోగులపైనా అదే చర్యలు తీసుకున్నారు. మొత్తంగా పది నెలల వ్యవధిలో వివిధ హోదాల్లో ఉన్న 55 మంది పోలీసు అధికారులపై వేటుపడినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి
-
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!