Health News: ఏ తిండీ.. నమ్మలేమండి!
రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్ఫుడ్ కేంద్రం.. నక్షత్రాల హోటల్.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని రాష్ట్ర ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది.
వెన్న, నెయ్యి, పాల ఉత్పత్తుల్లో 26 శాతం నాసిరకం
హోటల్ తిండిలో 22% హానికరమే
పండ్లు, నూనెలు, పప్పుల్లోనూ ప్రమాణాలు లోపభూయిష్టం
ఆహార పరిరక్షణ నమూనాల్లో వెల్లడైన వాస్తవాలు
అయితరాజు రంగారావు
ఈనాడు, హైదరాబాద్
* పేరున్న రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా? అది రుచికరంగా ఉండేందుకు కొన్ని రసాయనాలు కలిపి ఉండొచ్చు!
* ఐస్క్రీమ్ను చూడగానే తినకుండా ఉండలేకపోతున్నారా? ఆ పాల ఉత్పత్తుల్లో హానికారక పదార్థాలు దాగి ఉండొచ్చు!
* రోడ్డు పక్కన బండిలో వేగుతున్న మిర్చీ బజ్జీలను చూడగానే నోరూరుతోందా? జాగ్రత్త.. ఆ నూనె నాణ్యత ప్రశ్నార్థకమే!
..ఇవి అనుమానాలు కాదు. రాష్ట్ర ఆహార పరిరక్షణాధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు.
రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్ఫుడ్ కేంద్రం.. నక్షత్రాల హోటల్.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని రాష్ట్ర ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. టీ పొడి, పాలు, పండ్లు, పప్పులు, సాస్లు, చక్కెరతో చేసే మిఠాయిలు, నూనె, కారంపొడి, బేకరీ ఉత్పత్తులు, నిల్వ, తీపి పదార్థాలు, హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకూ అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయని పరీక్షల్లో తేలింది. తెలంగాణ ఆహార పరిరక్షణాధికారులు ఏప్రిల్-2021 నుంచి మార్చి-2022 వరకు 4,343 వేర్వేరు నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 383 (8.8శాతం) పదార్థాలు హానికరం, నాసిరకం, నకిలీవని వెల్లడైంది. వీటిలో 2 శాతం నమూనాలను హానికరమైనవిగా గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహారాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పటికప్పుడు కనిపించే జీర్ణకోశ సమస్యలే కాకుండా.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిబ్బంది కొరతే అసలు కారణం
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం.. గ్రామీణ ప్రాంతంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార పరిరక్షణాధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక అధికారి ఉండాలి. అయితే రాష్ట్రంలో ‘ఆహార పరిరక్షణాధికారుల (ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్) పోస్టులు 52 శాతం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన నమూనాల సేకరణ, ప్రయోగశాలల్లో పరీక్షలు, నిత్యం పర్యవేక్షణ తదితర ప్రక్రియలు తూతూమంత్రంగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్రాల వారీగా 2020-21 సంవత్సరానికి ఆహార పరిరక్షణ సూచికలను భారత ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) విడుదల చేయగా.. ఇందులో మానవ వనరులు, సమాచార సేకరణ కేటగిరీలో తెలంగాణకు 20 మార్కులకు గాను 9 మాత్రమే వచ్చాయి. కనీసం జిల్లాకొక ఆహార పరిరక్షణాధికారి కూడా లేరు. ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 22 మందిని తీసుకోగా.. మిగిలిన జిల్లాలన్నింటికీ కలిపి కేవలం 14 మందిని నియమించారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీలో మొత్తం 30 పోస్టులకు 8 ఖాళీలుండగా..32 జిల్లాల్లో 51 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులకు గాను 37 ఖాళీగా ఉన్నాయి. కొత్తగా మరో 24 మందిని నియమించడానికి ప్రభుత్వం అనుమతించినా.. ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఎన్ని నమూనాలు తీశారు? ఎన్నింటిని ల్యాబ్లకు పంపించారు? అనే అంశాలనూ మార్కుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మానవ వనరుల కొరత కారణంగా ఆ వేగం మందగించింది. ఈ అంశంలో 30 మార్కులకు గాను 11 మార్కులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.
ఇవీ నిబంధనలు..
* రోడ్డు పక్కన మిర్చీ బజ్జీలు విక్రయించే బండ్లు మొదలుకొని ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, నిల్వ ఆహార ఉత్పత్తులు, రెస్టారెంట్ల వరకూ అన్ని స్థాయుల్లోనూ ఆహార పరిరక్షణ అధికారులు క్రమం తప్పకుండా ఆహార నమూనాలను సేకరించి, వాటిని పరీక్షల కోసం పంపించాలి.
* ప్రమాణాలు లేనివి మూడు రకాలు: 1. హానికరం 2. నకిలీ (మిస్ బ్రాండెడ్) 3. నాసిరకం. ఈ మూడింటిపై కేసు నమోదు చేస్తారు.
హానికరం..నాణ్యత లోపం..నకిలీ ఇలా..
* వెన్న, నెయ్యి, ఐస్క్రీములు, ఇతర పాల ఉత్పత్తుల్లో 26.31 శాతం
* మాల్స్లో విక్రయించే నిల్వ పచ్చళ్లు, హోటళ్లలోని ఆహారాల్లో 22 శాతం
* మిఠాయిలకు వినియోగించే పదార్థాల్లో 12.10 శాతం
* పండ్లు, కూరగాయల ఉత్పత్తులు (ఉదా।। జామ్, జెల్లీస్) తదితరాల్లో 10.05 శాతం
* కేకులు, బిస్కెట్లు, బన్నులు, పఫ్లు, సమోసాలు, తదితర బేకరీ ఉత్పత్తుల్లో 9.5 శాతం
* టీ, కాఫీ, కోకో, చికోరీ తదితర పొడుల్లో 8.73 శాతం
* పాలల్లో 8.23 శాతం
* చిప్స్ లాంటి నిల్వ పదార్థాల్లో 8 శాతం
* వంటల్లో వాడే నూనెలు, వనస్పతిలలో 7 శాతం
* ఉప్పులో 4.48 శాతం
* గింజధాన్యాలు, వాటి ఉత్పత్తుల్లో 2 శాతం
* సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల్లో 1.36 శాతం
* వీటికి సంబంధించిన పొడుల్లో 5.21 శాతం
* సుపారీ, పాన్ మసాలా, గుట్కా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం కాగా.. ఈ ఉత్పత్తుల్లో 14.34 శాతం మరింత హానికరమైనవి ఉన్నట్లు గుర్తించారు.
అమెరికాలో ఇలా..
* అమెరికా ప్రభుత్వం ఆహార కోడ్ (కచ్చితమైన ప్రమాణాలు), పరిశుభ్రమైన, ప్రమాణాలతో కూడిన ఆహారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది.
* ప్రతి రాష్ట్రంలో అక్కడి జనాభా మేరకు కనీసం రెండు నుంచి నాలుగు వరకు అత్యాధునిక ప్రయోగశాలలున్నాయి. హోటళ్లలో కలుషితానికి అక్కడి మేనేజర్లను బాధ్యులుగా చేస్తారు. ప్రమాణాల మేరకు ఆహారం లేకుంటే కఠినంగా శిక్షిస్తారు.
* తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు మాంసాహారం, శాకాహార నమూనాలను తీసుకుని.. అందులో ఈ-కొలి బ్యాక్టీరియా, పరిమితికి మించిన లవణ లోహాలను పరీక్షిస్తారు.
* ఆహారాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించే ఐస్ను తాగునీటితో తయారు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి