Group-1: కఠినంగా గ్రూప్-1 ప్రిలిమ్స్!
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
సివిల్స్ స్థాయిలో ప్రశ్నలు వచ్చాయంటున్న నిపుణులు
కరెంట్ అఫైర్స్, సైన్స్, రీజనింగ్పై ఎక్కువ ప్రశ్నలు
పరీక్షకు 75% అభ్యర్థుల హాజరు
ఓఎంఆర్ ఇమేజింగ్ తరువాత కీ విడుదల
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పరీక్షకు మొత్తం అభ్యర్థుల్లో 75 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులకు గాను 3.42 లక్షల మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీ కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. ఓఎంఆర్ ఇమేజింగ్ పూర్తయిన తరువాత ప్రాథమిక కీని విడుదల చేస్తామని.. ఇందుకు కనీసం ఎనిమిది రోజుల సమయం పడుతుందని కమిషన్ తెలిపింది. ప్రాథమిక కీని వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొంది. కాగా, పరీక్షలో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని పలువురు అభ్యర్థులు, నిపుణులు తెలిపారు.
బయోమెట్రిక్ హాజరు..
పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకున్నారు. అభ్యర్థి ఫొటో, వేలిముద్ర తీసుకుని పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. కొన్నిచోట్ల చివరి నిమిషంలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు రావడంతో వారందర్నీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించి, ఆ తర్వాత బయోమెట్రిక్ నమోదు చేశారు.కొన్నిచోట్ల పరీక్ష ముగిసిన తరువాత తీసుకున్నారు.
* ఖమ్మంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఆదివారం ఉదయం విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో మొబైల్ఫోన్ లైట్ల వెలుతురులో సిబ్బంది బార్కోడ్ స్కానింగ్, అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు తీసుకున్నారు.
సివిల్స్ స్థాయిలో ప్రశ్నపత్రం...
ఒడిశాలోని కోడింగమాలి ఏ ఖనిజానికి ప్రసిద్ధి?.. తెలంగాణకు చెందిన డాక్టర్ కేశవులు ఎవరు? ఇస్టాలో బాధ్యతలు ఏమిటి?.. అండమాన్, నికోబార్లో పర్వత శిఖరాలు ఏవి?.. గ్రూప్-1లోని కొన్ని ప్రశ్నలివి.
ప్రిలిమ్స్లో ప్రశ్నలు కఠినంగా వచ్చాయని.. విశ్లేషణాత్మక, స్టేట్మెంట్ ఆధారిత, సుదీర్ఘ విశ్లేషణలతో కూడినవి ఎక్కువగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. వాటిని చదివి, అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించేందుకు సమయం సరిపోలేదని పేర్కొన్నారు. ప్రిలిమ్స్ ప్రశ్నల కాఠిన్యత, అడిగిన తీరు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష స్థాయికి మించి ఉందని నిపుణులు చెబుతున్నారు. కరెంట్ అఫైర్స్, సైన్స్, టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్ కేటగిరీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. సమాధానాలు గుర్తించేందుకు ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం చొప్పున సమయం ఉన్నప్పటికీ.. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు వచ్చాయి. నేరుగా సమాధానాలను గుర్తించే ప్రశ్నలు స్వల్ప సంఖ్యలో ఉన్నాయి. ప్రశ్నలను పూర్తిగా చదివే సమయం దొరకలేదని, సగటున 15-20 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించలేకపోయినట్లు కొందరు అభ్యర్థులు తెలిపారు. ప్రిలిమ్స్ కఠినంగా ఉండటంతో కటాఫ్ మార్కులు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని శిక్షణ సంస్థలు మార్కులపై సొంతగా అంచనాలు వేసుకుంటున్నాయి. ‘‘ఎక్కువ సమయం తీసుకునేలా, కఠినంగా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే కటాఫ్ 75-85 మధ్యలో ఉంటుందని అంచనా. ప్రిలిమ్స్, మెయిన్స్కు కలిపి సన్నద్ధమైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశాలున్నాయి’’ అని లా ఎక్స్లెన్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు.
స్క్రైబ్ వివరాలు రాలేదని అభ్యర్థిని అనుమతించని సిబ్బంది
కందనూలు, న్యూస్టుడే: నాగర్కర్నూల్లో ఓ దివ్యాంగ అభ్యర్థి పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అచ్చంపేటకు చెందిన పవన్కుమార్కు కంటిచూపు లోపం ఉంది. పరీక్ష రాసేందుకు సహాయకుడి(స్క్రైబ్) కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు సహాయకుడి వివరాలు రాలేదంటూ ఆయనను పరీక్ష కేంద్రం సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఆన్లైన్లో కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు పవన్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్