KTR: శీనన్న తాతైనా.. నన్ను రామన్న అంటున్నాడు: కేటీఆర్‌

హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన గౌడ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Updated : 24 Oct 2022 09:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన గౌడ సమ్మేళనంలో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ‘రామన్న వెంట తాను లక్ష్మణుడిలా ఉంటానని గౌడలకు సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘ఈ మధ్యనే శీనన్న (మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌) తాతైనా ఇంకా నన్ను రామన్నా అని పిలుస్తున్నాడు’ అని అనగానే వేదికపై ఉన్న వారంతా గొల్లున నవ్వారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని