Bhadrachalam: ఆ భూములు రాముడివి కాదు మావే..!
భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణల వివాదం కొత్త మలుపు తిరిగింది. రాముడి మాన్యం 917 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోని ఉన్న విషయం తెలిసిందే.
విలేకర్ల సమావేశంలో పురుషోత్తపట్నం రైతులు
రాముడి పేరిట పట్టా ఉంది : ఈవో
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణల వివాదం కొత్త మలుపు తిరిగింది. రాముడి మాన్యం 917 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోని ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది ఈ భూముల్లో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. తాజాగా సదరు భూములు తమవేనని.. అందుకు సంబంధించిన అన్ని పత్రాలు తమవద్ద ఉన్నాయని కొందరు చెప్పారు. బుధవారం భద్రాచలంలో... పురుషోత్తపట్నం రైతు సంఘం పేరిట విలేకర్ల సమావేశం నిర్వహించారు. కె.రామిరెడ్డి, సీహెచ్ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే...
‘‘సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు 1878లో ఈ భూమిని రాముడి పేరిట దానం చేశారు. తర్వాత 1912లో నిజాం ప్రభుత్వం వరంగల్ గవర్నర్ ద్వారా వేలం వేయించగా దీన్ని అబ్దుల్ హుస్సేన్ రూ.వెయ్యికి కొనుగోలు చేశారు. దీన్ని ఆయన భార్య ఫాతిమా బేగం 1938లో రూ.4500కి మాజేటి రామచంద్రయ్య, రేపాక వెంకటరత్నంలకు అమ్మేశారు. తర్వాత రజాకార్ల ఆగడాలను భరించలేక ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన 60 కుటుంబాలు పురుషోత్తపట్నం వచ్చాయి. తామంతా స్థల యజమానుల వద్ద ఎకరాకు రూ.12 చొప్పున చెల్లించి 1957 మార్చి 14న కొనుగోలు చేశాం. మూడో దఫా చెల్లించే తరుణంలో రామాలయ అధికారులు అడ్డు తగిలారు. అరణ్యాన్ని సాగుకు యోగ్యంగా మార్చిన తర్వాత దేవస్థానం ఉద్యోగులు వచ్చి ఇది దేవుడి భూమి అనడం ఎంతవరకు సబబు? ఇప్పటివరకు న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు క్రయవిక్రయాల పత్రాలు చూపించేందుకు మేం సిద్ధం’’ అని రైతులు తెలిపారు.
వారి వద్ద ఉన్నవి తప్పుడు పత్రాలు
పురుషోత్తపట్నంలోని భూములపై భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి పేరిట పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయి. ఆన్లైన్లోనూ పొందుపర్చారు. ఇది పూర్తిగా దేవస్థానం ఆస్తి. పురుషోత్తపట్నం వాసుల వద్ద ఉన్న డాక్యుమెంట్లు నిజమైనవే అయితే ఇంతకాలం డ్యామేజీ ఛార్జీలను ఎందుకు చెల్లించారు?. వారి వద్ద ఉన్నవి తప్పుడు పత్రాలు. భద్రాచలం గతంలో తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. అలాంటప్పుడు వరంగల్లో వేలం నిర్వహించి ఎవరో విక్రయిస్తే ఇంకెవరో కొనుగోలు చేశారనడం సరైంది కాదు. వివాదాలు లేకుండా ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు మేం సిద్ధం.
- శివాజీ, భద్రాచలం రామాలయ కార్యనిర్వహణాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్