Gangula Kamalakar: మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు
విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించాయన్న ఆరోపణలపై పలు గ్రానైట్ సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది.
ఆ సమయంలో విదేశాల్లో కమలాకర్
ఇంటి తాళం పగలగొట్టించి లోనికి వెళ్లిన అధికారులు
పలు గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లోనూ తనిఖీలు
‘ఫెమా’ నిబంధనలు ఉల్లంఘించారని అభియోగాలు
ఈనాడు, హైదరాబాద్, కరీంనగర్: విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించాయన్న ఆరోపణలపై పలు గ్రానైట్ సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సోదాలు నిర్వహించింది. ఇందులో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్-శ్వేత ఏజెన్సీస్ కూడా ఉండటం గమనార్హం. వీటితోపాటు హైదరాబాద్, కరీంనగర్లలోని పలు గ్రానైట్ సంస్థల కార్యాలయాలు, క్వారీలు, డైరెక్టర్ల ఇళ్లలోనూ జరిగిన ఈ సోదాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. 20కి పైగా అధికార బృందాలు ఇందులో పాల్గొన్నాయి. రాత్రి పొద్దుపోయేవరకు సోదాలు కొనసాగాయి. దుబాయ్ వెళ్లిన మంత్రి.. సోదాల సమాచారం అందడంతో బుధవారం రాత్రి హైదరాబాద్కు తిరిగివచ్చారు. బుధవారం ఉదయం 8గంటలకు కరీంనగర్కు వచ్చిన ఆరు ప్రత్యేక బృందాల సభ్యులు ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. ఓ బృందం కోర్టు సమీపంలోని మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోకి వెళ్లింది. మంత్రి తన ఇద్దరు సోదరులతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన తన కుటుంబసభ్యులతో ఇటీవలే దుబాయ్ వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆయన సోదరుడు సుధాకర్, సోదరుడి కుమారుడు ప్రదీప్ల సమక్షంలో అధికారులు సోదాలు చేసి.. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఇంట్లో మంత్రికి ప్రత్యేక కార్యాలయం, దానిపైన ఆయనకు ప్రత్యేక నివాసం ఉన్నాయి. దీనికి తాళం వేసి ఉండటంతో మంత్రికి ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఆయన అంగీకారంతో తాళం పగలగొట్టించి.. అధికారులు లోపలికి ప్రవేశించారు. మంకమ్మతోటలోని శ్వేత గ్రానైట్స్ కార్యాలయం, కమాన్రోడ్డులోని అరవింద్ గ్రానైట్స్, శాస్త్రి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ కార్యాలయం, జ్యోతినగర్లోని పీఎస్సార్ ఏజెన్సీ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని పీఎస్సార్ గ్రానైట్స్కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, వెంకటేశ్వర గ్రానైట్స్కు సంబంధించి హైదర్గూడలోని కార్యాలయం, ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు, హార్డ్డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ నేపథ్యం
కరీంనగర్ నుంచి విదేశాలకు పెద్ద ఎత్తున గ్రానైట్ ఎగుమతి అవుతుంటుంది. గ్రానైట్ తవ్వకాలకు, ఎగుమతి అయ్యే పరిమాణానికి భారీ వ్యత్యాసాలున్నాయని 2013లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ సోదాల్లో గుర్తించారు. ఇలా ఎక్కువ పరిమాణంలో గ్రానైట్ను వెలికితీసి, రికార్డుల్లో తక్కువ చూపించడం వల్ల ప్రభుత్వానికి రూ.124.94 కోట్ల నష్టం వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు అప్పట్లోనే తేల్చారు. దానికి అయిదింతల జరిమానా లెక్కించి.. ఎగవేతకు పాల్పడ్డ సంస్థలన్నీ కలిపి.. రూ.749.66 కోట్లు చెల్లించాలని 2013లోనే నిర్ధారించారు. ఈ మేరకు శ్వేత ఏజెన్సీస్- శ్వేత గ్రానైట్స్, ఎ.ఎస్.షిప్పింగ్, జె.ఎం.బాక్సి అండ్ కో, మైథిలి-ఆదిత్య ట్రాన్స్పోర్టు, కె.వి.కె.ఎనర్జీ, అరవింద గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్సార్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్/వెంకటేశ్వర లాజిస్టిక్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత.. ఆయా సంస్థల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రూ.749.66 కోట్లు కాకుండా.. రూ.124.94 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని వెసులుబాటు ఇచ్చింది. అందులోనూ ఇప్పటివరకు కేవలం రూ.11 కోట్లు మాత్రమే చెల్లించాయన్నది ఆరోపణ.
ఫిర్యాదుల వెల్లువ
రాయల్టీ, సీనరేజి చెల్లింపుల్లో ప్రభుత్వం రాయితీలిచ్చినా.. తప్పుడు లెక్కల వల్ల పెద్దఎత్తున విదేశీమారకద్రవ్యం అక్రమంగా చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ పరిమాణం లెక్కల్లో చూపించి అనేక రెట్లు ఎక్కువగా ఎగుమతి చేశారు. దానికి సంబంధించిన విదేశీమారకద్రవ్యం అనధికారికంగా ఆయా సంస్థల ఖాతాల్లోకి చేరిందని అనుమానం. ఇది ఫెమా ఉల్లంఘన కిందికే వస్తుందని.. విచారణ జరపాలని వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 2019లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్జోషి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైలకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్కు చెందిన న్యాయవాది భేతి మహేందర్రెడ్డి 2021 ఏప్రిల్లో హైదరాబాద్, దిల్లీల్లో ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. గత ఏడాది భాజపా నాయకులు పేరాల శేఖర్రావు, కరీంనగర్కు చెందిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన సింగిరెడ్డి భాస్కర్రెడ్డిలు కూడా ఫిర్యాదు చేసినవారిలో ఉన్నారు.
దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా
గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి తమ సంస్థలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తాము ప్రభుత్వ అనుమతులతో, పారదర్శకంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ఇంటిలో, సంస్థలో తనిఖీలు చేపట్టిన ఈడీకి సంపూర్ణ సహకారం అందిస్తానని, వారికి కావాల్సిన సమాచారం ఇస్తానని తెలిపారు. దీని ద్వారా నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత ఆ సంస్థదేనని అన్నారు. బుధవారం రాత్రి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన మంత్రి.. శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘నేను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు మా ఇంటికి వచ్చారు. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లవచ్చని తెలిపాను. ఇంట్లోని ప్రతి లాకర్ తెరిచి చూసుకోవచ్చని చెప్పాను. సోదాల్లో ఏం దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో వారే చెప్పాలి. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. బయటి దేశాల నుంచి డబ్బులు హవాలాలో తెచ్చామా అనేది ఈడీ, డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ చూస్తాయి. ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే వెంటనే విదేశాల నుంచి వచ్చా. గతంలో సైతం చాలా మంది రాజకీయ కక్షతో ఈడీ, ఐటీలకు ఫిర్యాదులు చేసినా ఏమీ తేలలేదు. ఈసారీ అదే జరుగుతుంది’ అని గంగుల చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ