మూలిగే నక్కపై తాటికాయలా అధిక జనాభా
ఘర్షణలు, భూతాపం, తీవ్రస్థాయి వాతావరణ పోకడలు, ఆర్థిక మందగమనాలు, తిరోగమనాలతో ప్రపంచం ఇప్పటికే సతమతమవుతోంది.
ఘర్షణలు, భూతాపం, తీవ్రస్థాయి వాతావరణ పోకడలు, ఆర్థిక మందగమనాలు, తిరోగమనాలతో ప్రపంచం ఇప్పటికే సతమతమవుతోంది. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభా వల్ల అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు తీవ్ర రూపం దాలుస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారితో పరిస్థితి సంక్లిష్టమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
* పరిస్థితులు ఎంతలా మెరుగుపడినా 2030 నాటికి 66 కోట్ల మంది క్షుద్బాధతో అల్లాడతారని అంచనా.
* 2020లో ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మందికిపైగా ఎంతో కొంత ఆహార కొరతను ఎదుర్కొన్నారు.
* దాదాపు 300 కోట్ల మందికి పోషకాహారం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటంలేదు. భవిష్యత్లో ఈ సమస్యలు తీవ్రం కానున్నాయి.
సేద్యం, ఆహార భద్రతకు
భూమిపై 40 శాతం భూభాగం పంట, పశువులకు గడ్డి నేలలుగా ఉపయోగపడుతోంది. అటవీ భూభాగం (30 శాతం) కన్నా ఇది అధికం. అభివృద్ధికి నోచుకోని దేశాల్లో 70 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటోంది. వీరికి వ్యవసాయమే జీవనాధారం. వాతావరణ మార్పుల ప్రభావం సేద్యంపై ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పంట దిగుబడులు తగ్గొచ్చు. జనాభా ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాల్లో ఈ ఇబ్బంది తీవ్రంగా ఉండొచ్చు. ఇది సామూహిక వలసలకు దారితీయవచ్చు.
కరవు భూతం: క్రీస్తు శకం 850లో మధ్య అమెరికాలో మాయన్ నాగరికత అంతం కావడానికి కరవే కారణం.
* 19వ శతాబ్దం చివర్లో ఇదే సమస్యతో చైనాలో 6 కోట్ల మంది మృత్యువాత పడ్డారు.
* అభివృద్ధి చెందిన దేశాలనూ కరవు మహమ్మారి కాటేసింది. 1845-1852 మధ్య ‘ఐరిష్ పొటాటో కరవు’ తలెత్తింది. బంగాళా దుంపల్లో వచ్చిన పొటాటో బ్లైట్ వ్యాధే ఇందుకు కారణం. దీనివల్ల 10 లక్షల మంది చనిపోయారు.
* 20వ శతాబ్దంలో కరవుల వల్ల 7 కోట్ల మంది చనిపోయి ఉండొచ్చని అంచనా. ఇందులో 3 కోట్ల మంది 1958-1961 మధ్య చైనాలో బలయ్యారు. 1943లో భారత్లో 70 లక్షల నుంచి కోటి మంది చనిపోయారు.
ఎంత మందికి ఆహారం..?
ఎంత జనాభాకు పుడమిపై సుస్థిరంగా జీవించడానికి ఆస్కారం ఉందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై భిన్న రకాల అంచనాలు వచ్చాయి. 2020లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పుడమికి సంబంధించిన ఎలాంటి పరిమితులను ఉల్లంఘించకుండా.. ఉన్న ఆహార వనరులతో 300 కోట్ల మందికి మాత్రమే తిండి పెట్టొచ్చు. సాగు విధానాలు, పంట రకాలు, ప్రదేశాలు వంటి అంశాల్లో మార్పు ద్వారా దాన్ని 800 కోట్లకు పెంచొచ్చు. వృథాను తగ్గిస్తే మరింత మందికి ఆహారం అందించొచ్చు.
పులి మీద పుట్రలా భూతాపానికి, అధిక జనాభా తోడుకావడం మానవ ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేడిమి పెరగడం వల్ల ఆరోగ్యపరంగా ఉత్పన్నమయ్యే ప్రధాన సమస్యలివీ..
అంటువ్యాధులు: మానవుల్లో వచ్చే సాంక్రమిక వ్యాధుల్లో దాదాపు సగం.. వాతావరణ మార్పుల వల్ల మరింత పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు పెరిగి, నీటి నాణ్యతపై ప్రభావం పడుతుంది. బ్యాక్టీరియా, వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు వంటి వాహకాలు పెరుగుతాయి.
* డెంగీతో ఇప్పటికే 10 కోట్ల మంది బాధపడుతున్నారు. జనాభా పెరిగేకొద్దీ ఇది సర్వసాధారణమవుతుంది. ఈ వ్యాధి వ్యాప్తిని ఆర్వో (రిప్రొడక్షన్ నంబర్)తో కొలుస్తారు. 1950లతో పోలిస్తే 2012-21 నాటికి ఇది ఏకంగా 12 శాతం మేర పెరిగింది.
* లాటిన్ అమెరికాలో 31 శాతం మేర, ఆఫ్రికాలోని పలు చోట్ల 14 శాతం మేర మలేరియా సీజను పెరిగింది.
* హెపటైటిస్, డయేరియా వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల వ్యాప్తి పెరుగుతుంది.
* కరవుల వల్ల నీటి నాణ్యత తగ్గిపోతుంది. ఆహారం కోసం ఎలుకలు ఇళ్లల్లోకి చొరబడటం ఎక్కువవుతుంది. హంటావైరస్ వంటి వ్యాధుల వ్యాప్తికి ఇది దారితీయవచ్చు.
* పెరుగుతున్న వేడి వల్ల మానవుల్లో గుండె, శ్వాస, మెదడు, మూత్రపిండాల వ్యాధులు పెరగొచ్చు.
* నేడు ప్రపంచ జనాభాలో 30 శాతం మంది అధిక ఉష్ణ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి అది 76 శాతానికి పెరగొచ్చని ఐపీసీసీ నివేదిక స్పష్టంచేస్తోంది.
* తీవ్రస్థాయి వేడి వల్ల గత ఏడాది 470 బిలియన్ పనిగంటలు, 669 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రపంచం నష్టపోయింది.
* జనాభా, వేడి పెరుగుదల వల్ల ఏసీలపై ఆధారపడేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం శిలాజ ఇంధనాలను మండించాలి. ఫలితంగా వాతావరణ మార్పులు మరింత పెరుగుతాయి.
ఆహారం, నీటి భద్రత: పెరుగుతున్న జనాభాకు వేడిమి వల్ల ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. 1981- 2020తో పోలిస్తే 2021లో అధిక ఉష్ణోగ్రతల వల్ల సరాసరిన మొక్కజొన్న సాగుకు అనుకూల కాలం 9.3 రోజుల మేర పడిపోయింది. గోధుమ విషయంలో ఆ నష్టం ఆరు రోజుల మేర ఉంది.
* 1981-2010తో పోలిస్తే.. 2020లో వేడి గాలుల వల్ల 9.8 కోట్ల మందికి కొత్తగా ఆహార భద్రత సమస్య ఎదురైంది. నీరు ఆవిరి కావడం, హిమానీనదాలు క్షీణించి తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది.
* నీటి కొరత, కరవు కారణంగా 2030 నాటికి 70 కోట్ల మంది వలసబాట పట్టాల్సి వస్తుంది.
పేలవమైన వాయు నాణ్యత: వాయు కాలుష్యం వల్ల వాతావరణ మార్పుల తీవ్రత పెరుగుతుంది. ఫలితంగా అలర్జీలు, ఉబ్బసం, ఇతర శ్వాస కోశ వ్యాధులు, గుండె జబ్బులు రావొచ్చు.
వృద్ధి రేటు తగ్గుముఖం
పలు దేశాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతోంది. సంతాన సాఫల్య రేటు పడిపోవడమే ఇందుకు కారణం. దీనికితోడు సగటు ఆయుర్దాయం పెరగడం వల్ల అక్కడ వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఐరోపా దేశాలు, జపాన్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి చోట్ల ఈ పరిస్థితి ఉంది. జనాభాలో వయోధికుల వాటా పెరగడం ఆయా దేశాలకు ఆర్థికంగా ఇబ్బందికరం.
* 2022 నుంచి 2050 మధ్య 61 దేశాలు, ప్రాంతాల్లో జనాభా 1 శాతం మేర తగ్గొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే