వైద్య విద్యలో నూతన శకం
రాష్ట్రంలో వైద్యవిద్య పరుగులు పెడుతోంది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి.
ఒకేసారి 8 కొత్త కళాశాలలు అందుబాటులోకి..
ఈ ఏడాది నుంచే తరగతులు
నేడు ప్రారంభించనున్న సీఎం
ఈనాడు- హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యవిద్య పరుగులు పెడుతోంది. ఒకే ఏడాది ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాకో వైద్య కళాశాలను నెలకొల్పాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సాకారమయ్యే దిశగా మరో అడుగు పడుతోంది. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండం వైద్య కళాశాలల్లో 2022-23 వైద్యవిద్య సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా 1,150 సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. నూతన వైద్య కళాశాలల్లో తరగతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్లో ఒకేసారి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన ఎల్ఈడీ తెరలను ఆయా వైద్య కళాశాలల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు.
8 ఏళ్లలో 12 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఉస్మానియా(1946), గాంధీ(1954) వైద్య కళాశాలలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించే నాటికే ఏర్పడ్డాయి. ఆ తర్వాత 1959లో కాకతీయ వైద్య కళాశాల.. అనంతరం ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పారు. తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం జిల్లాకొక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. మొదటి దశలో మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో అందుబాటులోకి వచ్చాయి. రెండో దశలో ఈ ఏడాది నుంచే మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. వచ్చే ఏడాది 9, ఆ మరుసటి సంవత్సరం మరో 8 ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే పచ్చజెండా ఊపింది.
పేదలకు చేరువగా స్పెషాలిటీ వైద్యం
జిల్లాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో.. ప్రజలు హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం ద్వారా రానున్న రోజుల్లో వీటిలో పీజీ వైద్య సీట్లు వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకొని.. మొత్తం 35 విభాగాలు సేవలందిస్తాయి. 24 గంటలూ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు లభిస్తాయి. ప్రతి బోధనాసుపత్రిలోనూ సుమారు 449 మంది వైద్యులు, 600 మందికి పైగా పారామెడికల్ సిబ్బంది ఉంటారు. స్పెషాలిటీ వైద్యం కోసం హైదరాబాద్కు రావాల్సిన అవసరం కొంతమేరకైనా తగ్గుతుంది. చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి.. రూ.లక్షలు ఖర్చు పెట్టి వైద్యవిద్య అభ్యసించే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. వైద్య కళాశాలలకు అనుబంధంగా అనేక వసతులు ఏర్పడతాయి. బోధనాసుపత్రి అభివృద్ధి చెందుతుంది. కొత్తగా మానవ వనరుల అవసరం ఏర్పడి.. నూతన నియామకాలు చేపడతారు. స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వైద్య విప్లవానికి తెలంగాణ శ్రీకారం: మంత్రి హరీశ్రావు
దేశంలోనే వైద్య రంగంలో నూతన విప్లవానికి తెలంగాణ శ్రీకారం చుట్టబోతోంది. మంగళవారం ఒకేసారి 8 వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభం కాబోతుండటం దేశ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టం. మెడికల్ కాలేజీలు లేక, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక ప్రజలు ఎన్నో కష్టాలు పడేవారు. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స కోసం హైదరాబాద్కు పరిగెత్తాల్సి వచ్చేది. వందల కిలోమీటర్లు, గంటలపాటు ప్రయాణించి రాజధానికి చేరుకుని.. వారాలు, నెలల పాటు ఉండాల్సి వచ్చేది. కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోవడంతో పాటు తీవ్ర అవస్థల పాలయ్యేవి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కష్టాలను కళ్లారా చూశారు. దేశవ్యాప్తంగా కేంద్రం 157 వైద్య కళాశాలలు ఇచ్చినా తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్రానికి ఒక్కటీ మంజూరు చేయలేదు. పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలను చేరువ చేయడంతో పాటు విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. కొత్తగా బోధనాసుపత్రుల రాకతో ఇకనుంచి పెద్ద వ్యాధులకూ సమీపంలోనే నాణ్యమైన వైద్యం అందుతుంది. వచ్చే రెండేళ్లలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను నెలకొల్పడానికి ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.