డాక్టర్ డుమ్మా!
ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక న్యూరో సర్జన్ కొత్తపేటలోని కార్పొరేట్ ఆసుపత్రి, చైతన్యపురిలోని ఓ క్లినిక్, హయత్నగర్, దిల్సుఖ్నగర్లలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఉస్మానియాలో విధులు నిర్వర్తించాల్సిన సమయాన్నే ప్రైవేటు వైద్యానికి కేటాయించడం గమనార్హం.
మౌలిక సదుపాయాలున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అరకొరే
సర్కారీ జీతం తీసుకుంటున్నా... వైద్యుల ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీసుపైనే
బోధనాసుపత్రుల్లో సేవలు మరీ తీసికట్టు - వైద్యశాఖ నివేదికతో స్పష్టం
అయితరాజు రంగారావు
ఈనాడు- హైదరాబాద్
ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక న్యూరో సర్జన్ కొత్తపేటలోని కార్పొరేట్ ఆసుపత్రి, చైతన్యపురిలోని ఓ క్లినిక్, హయత్నగర్, దిల్సుఖ్నగర్లలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఉస్మానియాలో విధులు నిర్వర్తించాల్సిన సమయాన్నే ప్రైవేటు వైద్యానికి కేటాయించడం గమనార్హం. ఉస్మానియాలోనే పనిచేస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కాచిగూడ, బర్కత్పుర, కర్మన్ఘాట్ తదితర చోట్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇలాగే పనిచేస్తున్నారు. ఈ విషయాలను ప్రభుత్వ నిఘా వర్గాలే నిగ్గు తేల్చాయి. ఇలా ప్రైవేటు సేవలో తరిస్తున్న 28 మంది వైద్యులపై సర్కారుకు కొద్దిరోజుల కిందట నివేదిక అందింది.
వైద్యుల్లో సేవాభావం కొరవడితే.. వ్యవస్థంతా అస్తవ్యస్తమవుతుంది. ఉస్మానియా, గాంధీ సహా పలు ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నదిదే. కొంతమంది వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వర్తించాల్సి ఉన్నా.. అలా చేయడంలేదు. వారి ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీసుపైనే ఉంటోంది. సర్కారు ఆసుపత్రుల్లో విధులకు పూర్తిగా గైర్హాజరు కావడమో.. నామమాత్రంగా వచ్చి వెళ్లడమో చేస్తున్నారు. వైద్యమంత్రిగా హరీశ్రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తరచూ నిశితంగా సమీక్షిస్తున్నా.. కొన్ని విభాగాల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబరు నెల సమీక్షలో కొన్ని విభాగాల పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఆ సమీక్ష నివేదిక వివరాలను ‘ఈనాడు’ సేకరించింది. వీటిని పరిశీలిస్తే.. దాదాపు అన్ని విభాగాల్లోనూ తూతూమంత్రపు సేవలే అందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ విభాగాల్లో పనితీరు మరీ తీసికట్టుగా ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో సాధారణంగా ఒక్కో విభాగంలో 3 నుంచి 8 యూనిట్ల వరకు ఉన్నాయి. ఉదాహరణకు జనరల్ మెడిసిన్ విభాగాన్ని తీసుకుంటే.. గాంధీ వైద్యకళాశాలలో 8 యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్లో 8 మంది వైద్యులున్నారు. పీజీలను కూడా కలిపితే.. సుమారు 70 మంది వైద్యులున్నారు. కానీ రోజూ కేవలం ఒక్క యూనిట్ వైద్యులు మాత్రమే ఓపీలో ఉంటారు. గాంధీ ఆసుపత్రిలో నిత్యం జనరల్ మెడిసిన్ ఓపీకి సుమారు 200 మంది రోగులొస్తుంటే.. వీరిని 8 మంది వైద్యులు పరీక్షిస్తుంటారు. మిగిలిన ఏడు యూనిట్ల వైద్యులు ఓపీ వైపు రారు. వీటిలో కొన్ని యూనిట్ల వైద్యులు ఎంబీబీఎస్ విద్యార్థులకు, మరికొందరికి పీజీ వైద్యవిద్యార్థులకు తరగతులు బోధించాల్సి ఉంటుంది. ఇంకొన్ని యూనిట్ల వైద్యులు తమ వార్డుల్లో రోగులను పరీక్షిస్తారు. యూనిట్ల సంఖ్య అధికంగా ఉన్నందున.. ఓపీకి మరికొంతమందిని కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కార్పొరేట్, సర్కారు ఆసుపత్రులకు తేడా ఇదీ..
300 పడకలున్న కార్పొరేట్ ఆసుపత్రిలో ఉదయం 8 నుంచి రాత్రి 9-10 గంటల వరకు వైద్యులు పనిచేస్తుంటారు. ఉదాహరణకు నలుగురు కార్డియాలజిస్టులు, ఒకటే క్యాథ్ల్యాబ్ ఉంటే.. ఆ ల్యాబ్ను నలుగురూ తమ రోగులకు వేర్వేరు సమయాల్లో చికిత్స అందించేలా కార్యాచరణను అమలు చేస్తారు. తద్వారా ల్యాబ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఒక్క ల్యాబ్ మాత్రమే ఉన్నా.. నెలకు 300 యాంజియోగ్రాములు, 100 యాంజియోప్లాస్టీలు చేస్తుంటారు. బైపాస్ సర్జరీలు కూడా నెలకు 125 వరకు అవుతాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం ఉదయం 10 గంటలకొచ్చి మధ్యాహ్నం 2 గంటలకు ముందే వెళ్లిపోతుండడంతో అతి తక్కువ సంఖ్యలో చికిత్సలు నమోదవుతున్నాయి.
ఆసుపత్రుల్లో విభాగాల పనితీరు ఇలా..
నెఫ్రాలజీ:
* నిమ్స్: 12 మంది నెఫ్రాలజిస్టులు, 30 మంది పీజీలు ఉండగా.. కనీసం నెలకు 10 చొప్పున మూత్రపిండాల మార్పిడి చేస్తారు.
ఉస్మానియా: నలుగురు నెఫ్రాలజిస్టులు, 10 మంది పీజీలుండగా.. అక్టోబరులో కేవలం ఒక్క కిడ్నీ మార్పిడి మాత్రమే చేశారు. ఆగస్టు, సెప్టెంబరుల్లోనూ ఒక్కొక్కటి చేశారు.
* గాంధీ: నలుగురు నెఫ్రాలజిస్టులు, 8 మంది పీజీలుండగా.. గత నెలలో కేవలం 3 కిడ్నీ మార్పిడులు చేశారు.
న్యూరో సర్జరీ:
* నిమ్స్: 10 మంది న్యూరో సర్జన్లు, ఒక సీనియర్ రెసిడెంటు, 18 మంది పీజీలుండగా.. నెలకు 220 చొప్పున మేజర్ సర్జరీలు చేస్తారు.
* గాంధీ: ఆరుగురు న్యూరో సర్జన్లు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు, 8 మంది పీజీలుండగా.. అక్టోబరులో 119 మేజర్ సర్జరీలు చేశారు.
* ఎంజీఎం: ఆరుగురు న్యూరో సర్జన్లు, ఆరుగురు పీజీ వైద్యులుండగా.. గత నెలలో 11 మేజర్ సర్జరీలు మాత్రమే చేశారు.
చిత్రంలో కనిపిస్తున్నది ఉస్మానియాలో రూ.7 కోట్లతో నెలకొల్పిన అత్యాధునిక క్యాథ్ల్యాబ్. ఇక్కడ అయిదుగురు కార్డియాలజిస్టులు, 14 మంది పీజీ వైద్యులు ఉన్నారు. ఈ ల్యాబ్లో ‘3 డి ఇమేజ్’, ‘ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వు’ సౌకర్యాలున్నాయి. అంటే గుండె రక్తనాళాల్లో 50-60 శాతం పూడికలు ఏర్పడితే.. స్టెంట్ వేయాలా వద్దా అనేది గుర్తించడానికి ‘ప్రెజర్ వైర్’ను వాటి వద్ద పెడతారు. గుండె కవాటాల మార్పిడి, మరమ్మతులు, పేస్మేకర్ అమర్చడం, గుండె చుట్టూ నీరు చేరడం (పెరికార్డియల్ ఎఫ్యూజన్) వంటి వాటికి చికిత్సలు కూడా ఇందులోనే చేయడానికి అవకాశముంది. చేతులు, కాళ్లలోని రక్తనాళాల్లో, క్లోమగ్రంధిలోనూ కొన్నిసార్లు స్టెంట్లు వేయాల్సి వస్తుంది. వీటిని కూడా ఈ క్యాథ్ల్యాబ్లో చేయొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ల్యాబ్లో అక్టోబరు నెలలో కేవలం 90 యాంజియోగ్రామ్లు (రోజుకు సగటున 3 చొప్పున), 51 యాంజియోప్లాస్టీలు (రోజుకు సగటున 2 కంటే తక్కువగా) చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు కార్డియాలజిస్టులు, ఆరుగురు పీజీలుండగా.. అక్కడ అక్టోబరులో 150 యాంజియోగ్రామ్లు. 31 యాంజియోప్లాస్టీలు నిర్వహించారు. వరంగల్ ఎంజీఎంలో నలుగురు కార్డియాలజిస్టులు, ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు ఉండగా.. ఇక్కడ గత నెలలో 96 యాంజియోగ్రామ్లు.. 25 యాంజియోప్లాస్టీలు మాత్రమే చేశారు. అదే నిమ్స్లో 8 మంది కార్డియాలజిస్టులు, ముగ్గురు సీనియర్ రెసిడెంట్లు ఉండగా.. నెలకు 750 యాంజియోగ్రామ్లు (రోజుకు 25), 300 యాంజియోప్లాస్టీలు (రోజుకు 10) చొప్పున చేస్తున్నారు. నిమ్స్లో ఉన్నదీ.. ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం ఆసుపత్రుల్లో లేనిది.. కేవలం వైద్యుల అంకితభావమే!
ప్రముఖ ఆసుపత్రుల్లో కొన్ని విభాగాల పనితీరు ఇలా..
కార్డియో థొరాసిక్ సర్జరీ..
* నిమ్స్: ఏడుగురు కార్డియో థొరాసిక్ సర్జన్లు, 8 మంది సీనియర్ రెసిడెంట్లు ఉండగా.. నెలకు సుమారు 50 వరకు బైపాస్ సర్జరీలు, 90 మేజర్ సర్జరీలు చేస్తున్నారు.
* ఉస్మానియా: ఒక్క సీటీ సర్జన్, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. గత మూడు నెలలుగా ఒక్క బైపాస్ సర్జరీ, ఒక్క మేజర్ సర్జరీ కూడా చేయలేదు.
* గాంధీ: ముగ్గురు సీటీ సర్జన్లు, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. అక్టోబరు నెలలో కేవలం 8 బైపాస్ సర్జరీలు చేశారు. మేజర్ సర్జరీలు 10 చేశారు.
* ఎంజీఎం: ఇద్దరు కార్డియో థొరాసిక్ సర్జన్లు, ఒక పీజీ వైద్యుడు ఉండగా.. అక్టోబరులో రెండు బైపాస్ సర్జరీలు, రెండు మేజర్ సర్జరీలు మాత్రమే చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!