సంక్షిప్త వార్తలు(9)
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీఐ)లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.
ప్రభుత్వ పథకాలపై అధికారులకు శిక్షణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్ఆర్డీఐ)లో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. తెలంగాణ నీటి పారుదల రంగం అభివృద్ధి, ఆర్ధిక వనరులు, వ్యవసాయం, సంక్షేమం, వైద్యం, విద్య తదితర అంశాలపై అధికారులకు నిపుణులతో అవగాహన కల్పించినట్లు ఎంసీహెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్ మహేశ్ బెనహర్ దత్ ఎక్కా తెలిపారు. శిక్షణ పొందిన వారికి ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు.
పెన్షన్ పేమెంట్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి అనుబంధంగా ఏర్పాటైన పెన్షన్ పేమెంట్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. టీజీవో భవన్లో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షురాలిగా అంజుమ్, కార్యదర్శిగా ప్రభాకర్ శ్రీవాస్తవ, సహాధ్యక్షుడిగా తాజుద్దీన్, కోశాధికారిగా ఖలీల్, ఇతర ప్రతినిధులుగా పార్వతీదేవి, సయ్యద్ ముజమ్మిమల్, శ్రీనివాసరావు, ముఖీం ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గాన్ని టీజీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ, నేతలు కృష్ణయాదవ్, వెంకటేశ్వర్లు సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
నల్గొండ సీఈ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రభుత్వం ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: నీటి పారుదల శాఖ నల్గొండ ముఖ్య ఇంజినీరు (సీఈ) ఎం.శ్రీకాంత్రావు తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగనున్నారు. ఉద్యోగ విరమణ కోసం 2నెలల క్రితం ఆయన ప్రభుత్వానికి చేసుకొన్న దరఖాస్తును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ గురువారం ఆమోదించారు.
ఎంఆర్సీ, సీఆర్సీ నిధులు విడుదల
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం మండల రీసోర్స్ సెంటర్(ఎంఆర్సీ), క్లస్టర్ రీసోర్స్ సెంటర్ (సీఆర్సీ)లకు రూ.5.9 కోట్లు విడుదల చేసింది. వీటిని ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ కార్యాలయాల నిర్వహణకు వినియోగిస్తారు.
తాటిని తన్నేలా ఈత!
సాధారణంగా ఈత చెట్టు పది నుంచి పదిహేను అడుగుల ఎత్తు పెరుగుతుంది. కానీ కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామ సమీపంలో మేనూర్ శివారులో ఉన్న ఈత చెట్టు మాత్రం ఏకంగా 70 అడుగుల ఎత్తు పెరిగి తాటి చెట్టులాగా కనిపిస్తోంది.
న్యూస్టుడే, మద్నూర్
పీజీ వైద్య, దంత విద్య సీట్లకు మరో విడత ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: కన్వీనర్ కోటాలో పీజీ వైద్య, దంత విద్య సీట్ల భర్తీకి శుక్రవారం (ఈ నెల 25) వరకు మరో విడత ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ విడత కౌన్సెలింగుకు అనర్హులు. సీట్ల ఖాళీలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపర్చారు. అర్హులైన అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవాలని ఆరోగ్య వర్సిటీ సూచించింది.
పీఈసెట్ తుది విడతలో 640 మందికి సీట్లు
పీఈసెట్ తుది విడత కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటాలో 1,307 సీట్లు అందుబాటులో ఉండగా 640 మందికి బీపీఎడ్, డీపీఎడ్ సీట్లు దక్కాయి. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు ఆయా కళాశాలల్లో చేరాలని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేశ్బాబు సూచించారు. తొలి విడతలో 914 మందికి సీట్లు దక్కగా.. వారిలో 552 మంది కళాశాలల్లో రిపోర్ట్ చేశారు.
28, 29 తేదీల్లో స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ల పరిశీలన
రాజేంద్రనగర్, న్యూస్టుడే: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ కోర్సులకు స్పోర్ట్స్ కోటాలో ప్రవేశాలకు సర్టిఫికెట్ల పరిశీలనను ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వెటర్నరీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులకు స్పోర్ట్స్ కోటాలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు.
రైల్వే సిగ్నలింగ్లో వేగవంతమైన పురోగతి
ఈనాడు, హైదరాబాద్: భారతీయ రైల్వే సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కమ్యూనికేషన్స్, సిగ్నలింగ్ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించిందని రైల్వే బోర్డు సభ్యుడు(మౌలిక సదుపాయాలు) ఆర్.కె.మంగ్లా పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీరింగ్, టెలికమ్యూనికేషన్స్(ఇరిసెట్) 65వ వార్షికోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆర్.కె.మంగ్లా ప్రసంగించారు. కమ్యూనికేషన్స్, సిగ్నలింగ్ రంగంలో సాంకేతిక పురోగతి సాధించడంలో ఇరిసెట్ పోషిస్తున్న పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ మాట్లాడుతూ- సిగ్నలింగ్, కమ్యూనికేషన్ రంగంలో ఇరిసెట్ లక్ష మందికి శిక్షణ అందించిందని తెలిపారు.
ఆర్టీసీలో మరో ఆరు నెలలపాటు సమ్మెల నిషేధం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీలో మరో ఆరు నెలలపాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. గతంలో విధించిన నిషేధం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో మరో దఫా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవల పరిధిలో ఆర్టీసీ ఉండటంతో ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రెగ్యులర్ పదోన్నతులు కల్పించండి
నీటిపారుదల శాఖ హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం నీటిపారుదల శాఖలో రెగ్యులర్ పదోన్నతులపై దృష్టిసారించి అందరికీ న్యాయం చేయాలని ఆ శాఖ హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం గౌరవ అధ్యక్షుడు సి.మహేందర్, అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చక్రధర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖలో సీనియారిటీ జాబితాలు 2018లో ఖరారు కావడంతో ఆ రాష్ట్రంలో అందరికీ రెగ్యులర్ పదోన్నతులు లభించాయని, తెలంగాణలో ఇప్పటికి తాత్కాలిక పదోన్నతులే అమలవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం సీనియారిటీని నిర్ధారించి 2018లో ఏపీ పంపిన జాబితాలను అమలుచేసి ఉంటే ఇప్పటివరకు పూర్తిస్థాయి పదోన్నతులు వచ్చేవని తెలిపారు. అవి రాష్ట్రంలో అమలుకాకుండా కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. ఉద్యోగుల పదోన్నతులు, ఇతర అంశాల్లోని వ్యత్యాసాలను కొంతైనా తొలగించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గత మే 28న జారీ చేసిన మెమోను పక్కనపెట్టి ఇటీవల తాత్కాలిక పదోన్నతులు కల్పించడం తగదని వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్