Govt Jobs: త్వరలో గ్రూప్ 2, 3!
రాష్ట్రంలో గ్రూప్-2, 3 కేటగిరీల్లో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవీ చేరనున్నాయి.
రెండింటిలో మరిన్ని పోస్టుల పెరుగుదల
నోటిఫికేషన్ల జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు
అదనంగా మరికొన్ని కేటగిరీలు
ప్రభుత్వ విభాగాల ప్రతిపాదనల పరిశీలన పూర్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-2, 3 కేటగిరీల్లో పోస్టులు పెరగనున్నాయి. ఇప్పటికే అనుమతించిన వాటికి అదనంగా ఇతర విభాగాల్లో గుర్తించినవీ చేరనున్నాయి. రాష్ట్రంలో గ్రూప్స్, ఇతర సర్వీసు ఉద్యోగాల వర్గీకరణలో భాగంగా గ్రూప్-2, 3 కేటగిరీల్లోకి మరిన్ని పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు పోస్టుల వర్గీకరణ, పరీక్ష, ఎంపిక విధానం నిబంధనలకు సవరణలు చేస్తూ జీవో నం.136 జారీ చేసింది. దీంతో ఈ ప్రకటనల జారీకి సాంకేతికపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-2లో ప్రభుత్వం కొత్తగా అనుమతించిన పోస్టులకు సంబంధించి ప్రభుత్వ విభాగాల నుంచి కమిషన్కు ఇప్పటికే ప్రతిపాదనలు అందాయి. వాటి పరిశీలన పూర్తయింది. అదనంగా చేర్చినవాటితో కలిపి త్వరలో గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. తొలుత గ్రూప్-2, ఆ తరువాత వారం నుంచి 15 రోజుల వ్యవధిలో గ్రూప్-3 నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. డిసెంబరు నాటికి ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
అదనంగా మరిన్ని పోస్టులు..
గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1,373 పోస్టులను గుర్తిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి అదనంగా వేర్వేరు విభాగాల్లో గ్రూప్-2, గ్రూప్-3 స్థాయి కలిగిన మరిన్ని పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఇలా అదనంగా చేర్చిన పోస్టులకు వేరుగా పరీక్ష నిర్వహించడం కన్నా.. తత్సమాన హోదా కలిగిన పోస్టులతో కలిపి నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. సహాయ సంక్షేమాధికారి పోస్టులకు గతంలో వేరుగా ప్రకటనలు వచ్చేవి. ఈ పోస్టులు తహసీల్దారు కన్నా ఎక్కువ హోదా కలిగినవి. వీటికి ప్రత్యేక నియామకాలు చేపట్టే బదులు గ్రూప్-2 కేటగిరీలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్-2 కేటగిరీలో ఎక్కువ హోదా కలిగిన ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు ఇప్పటికే రోస్టర్వారీగా ప్రతిపాదనలు రూపొందించి టీఎస్పీఎస్సీకి అందించాయి. ఇదే తరహాలో ప్రభుత్వ విభాగాల్లో సహాయ సెక్షన్ అధికారుల పోస్టులు పెరగనున్నాయి. సంక్షేమశాఖల్లో ఎస్సీ(17), ఎస్టీ(9), బీసీ(17) సహాయ సంక్షేమాధికారి పోస్టులు కలిపి 43 ఉన్నట్లు సమాచారం. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని జువైనల్ సర్వీసు విభాగంలో 11 జిల్లా ప్రొబేషనరీ అధికారి పోస్టులను గ్రూప్-2తో పాటే కమిషన్ భర్తీ చేయనుంది. సహాయ సెక్షన్ అధికారులవి కలిపి గ్రూప్-2లో మరో 100-150 వరకు పోస్టులు పెరిగే అవకాశముంది. ఇదేవిధంగా గ్రూప్-3లో ప్రస్తుతం అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరిన్ని చేరే అవకాశముంది.
గ్రూప్-3లో మరో రెండు సర్వీసులు..
గ్రూప్-3లో ప్రస్తుతం ఎనిమిది కేటగిరీల ఉద్యోగాలున్నాయి. కొత్తగా మరో రెండు సర్వీసులను చేర్చడంతో వీటి సంఖ్య పదికి చేరింది. కొత్తగా అకౌంటెంట్(గిరిజన సంక్షేమ సేవలు), ఇతర విభాగాధిపతుల కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్తో పాటు వీటి తత్సమాన కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్-3 పరిధిలో ఉంటాయి.
గ్రూప్-4లోనూ అదనంగా నాలుగు రకాలు..
గ్రూప్-4లో ప్రస్తుతం ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇతర తత్సమాన పోస్టులున్నాయి. వీటికి అదనంగా జువైనల్ విభాగం పరిధిలోని సూపర్వైజర్(పురుషులు), మాట్రన్-స్టోర్ కీపర్, సాంకేతిక విద్య కమిషనరేట్లో మాట్రన్ పోస్టులతో కలిపి నాలుగు రకాల కేటగిరీ ఉద్యోగాలు వచ్చాయి.
గ్రూప్-2లో మరో 6 కేటగిరీలు..
గ్రూప్-2 పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీసు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో ఆరు కేటగిరీల పోస్టులను చేర్చింది. సహాయ సెక్షన్ అధికారి(రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు), సహాయ సెక్షన్ అధికారి(ఇతర విభాగాలు), జిల్లా ప్రొబేషనరీ అధికారులు(జువైనల్ విభాగం), సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్-2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.