ఊరిస్తున్న వేతన సవరణ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను అయిదేళ్లుగా వేతన సవరణ ఊరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వారిలో ఆశలు రేకెత్తాయి.
అయిదేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు
త్వరలో ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను అయిదేళ్లుగా వేతన సవరణ ఊరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వారిలో ఆశలు రేకెత్తాయి. తక్షణం వేతన సవరణను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అభ్యంతరాలపైనా ఆగమేఘాలపై స్పందించింది. దీంతో వేతన సవరణ కార్యరూపంలోకి వచ్చినట్లేనని ఉద్యోగులు సంబరపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఇటు యాజమాన్యం నుంచి, అటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో వారిలో అయోమయం నెలకొంది. వేతన సవరణను తక్షణం అమలు చేస్తారా? 2023 సాధారణ ఎన్నికల వరకూ వేచిఉండాలా? అని బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
2013 తర్వాత రెండుసార్లు చేయాల్సి ఉన్నా..
వాస్తవానికి ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలు సవరించడం ఆనవాయితీ. చివరిసారిగా 2013లో వేతన సవరణ ప్రకటించారు. ప్రకటన తర్వాత రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వ్యవధిలో అమలు చేస్తుంటారు. 2013లో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని 2015 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. 2013 తరవాత రెండు సార్లు -2017 ఏప్రిల్, 2021 ఏప్రిల్లో- వేతన సవరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి 2017కు సంబంధించిన వేతన సవరణను మాత్రమే అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక భృతి కింద 16 శాతం చెల్లిస్తున్నారు. వేతనాలను ఎంత శాతం పెంచాలో ఇంకా నిర్ణయించలేదు. ఎంత మొత్తాన్ని ప్రకటించినా.. తాత్కాలిక భృతిని మినహాయించి మిగిలిన సొమ్ము చెల్లిస్తారు. సంస్థలో 46 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. నెలకు సుమారు రూ.425 కోట్ల వరకు వేతనాల కింద చెల్లిస్తున్నారు. పీఎఫ్తోపాటు అన్ని రకాల మినహాయింపులు పోను నెలకు సుమారు రూ.150 కోట్ల వరకు నికరంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక భృతిని మినహాయిస్తే నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఇది పెద్ద భారం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ‘‘వేతన సవరణ లేక ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలు సేవలందించే సంస్థలో ఇతర శాఖలతో పోలిస్తే జీతాలు తక్కువగా ఉన్నాయి. తక్షణం వేతన సవరణ అమలు చేయాలి’’ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
స్వయంగా సీఎం ప్రకటన!
వేతన సవరణ అమలుపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ముఖ్యమంత్రి నుంచి సూత్రప్రాయ ఆమోదాన్ని పొందినట్లు అధికారుల సమాచారం. ఉప ఎన్నిక సమయంలోనే నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశించినా.. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమీక్ష నిర్వహించి.. అమలును ప్రకటిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలాఖరులోగా ఆర్టీసీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
ఏడాదికి రూ.480 కోట్ల భారం
- బాజిరెడ్డి గోవర్ధన్, ఛైర్మన్, తెలంగాణ ఆర్టీసీ
వేతన సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలపై ఏడాదికి అదనంగా రూ.480 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజువారీ ఆదాయంలో కొంత తగ్గుదల నమోదవుతోంది. ప్రస్తుతం రూ.13 కోట్ల నుంచి రూ.14 కోట్ల మధ్యే వస్తోంది. వేతన సవరణ అమలు ఆర్టీసీకి భారమైనా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. త్వరలో ముఖ్యమంత్రి నుంచి అనుమతి లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
సీఎం జగన్పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి