అమెరికాకు అత్యధిక ఎగుమతులు
తెలంగాణలో తయారైన వస్తు సామగ్రిలో అత్యధికం (26.26 శాతం) అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా (6.78 శాతం), రష్యా (4.01 శాతం) ఉన్నాయి. రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలతో పాటు ఆహార, జౌళి ఉత్పత్తులు, వైమానిక విడిభాగాలు అమెరికాకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి.
ఆ తర్వాతి స్థానం చైనాది
ఎగుమతుల్లో ఔషధరంగం వాటా 33.41 శాతం
తెలంగాణలో ఎగుమతుల పురోగతిపై ప్రభుత్వ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో తయారైన వస్తు సామగ్రిలో అత్యధికం (26.26 శాతం) అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో చైనా (6.78 శాతం), రష్యా (4.01 శాతం) ఉన్నాయి. రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలతో పాటు ఆహార, జౌళి ఉత్పత్తులు, వైమానిక విడిభాగాలు అమెరికాకు ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. చైనా సైతం పత్తి, ఖనిజాలు, యంత్ర పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. రాష్ట్ర ఎగుమతుల శాఖ తాజాగా విడుదల చేసిన 2020-21 నివేదికలో ఈ అంశాలను నివేదించింది. 2020-21లో తెలంగాణ రూ.2,10,081 కోట్ల విలువైన సరుకులను విదేశాలకు ఎగుమతి చేసింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో ఇది 21.4 శాతంగా నమోదయింది. ఎగుమతి అయిన వాటిలో 33.41 శాతం ఔషధాలు కాగా.. ఆ తర్వాత సేంద్రియ రసాయనాలు 31.12 శాతం ఉన్నాయి.ఎగుమతుల సంసిద్ధత పరంగా తెలంగాణ దేశంలో రెండో స్థానంలో నిలవగా... అనుకూలతల్లో అయిదో స్థానం పొందినట్లు నివేదిక వెల్లడించింది.
సరళతర అనుమతుల ద్వారా..
రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వస్తువుల వినియోగంతో పాటు ఎగుమతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీఎస్ఐపాస్ విధానం తెచ్చి సరళతర అనుమతుల ద్వారా 20 వేలకు పైగా కొత్త పరిశ్రమలు, 56 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు అయ్యాయి. ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా వసతులు, ఇతర ప్రోత్సాహక చర్యలు చేపట్టడంతో ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి. 2019-20తో పోలిస్తే 2020-21లో రూ.30 కోట్లకు పైగా ఎగుమతులు పెరిగాయి. ఎగుమతుల మార్గనిర్దేశం చేసే తొలి 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది.
ఔషధ రంగానిదే అగ్రస్థానం
ఔషధరంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉంది. దేశంలోని ఔషధ ఉత్పత్తిలో 30 శాతం తెలంగాణలో జరుగుతోంది. దేశం నుంచి జరిగే ఔషధాల ఎగుమతిలో 50 శాతం వాటా రాష్ట్రానిదే. ఆ తర్వాతి స్థానంలో సేంద్రియ రసాయనాలు, మూడో స్థానంలో అణుయంత్రాలు (5.37శాతం), ఎలక్ట్రికల్ యంత్రాలు (4.67 శాతం), లవణాలు, ఖనిజాలు (2.82 శాతం) పత్తి (1.97 శాతం), పప్పు దినుసులు (1.76 శాతం), కాఫీ, టీలు (1.74 శాతం), వైమానిక పరికరాలు (1.04 శాతం), లోహ పరికరాలు (1.03 శాతం)కాగా ఇతర రంగాలవి 15.07 శాతం వస్తువులున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, చిప్లు, సౌరవిద్యుత్, వాహన పరికరాలతో పాటు జౌళి ఉత్పత్తులు, బియ్యం, నూనెలు, మామిడి, ద్రాక్ష, నిమ్మ, నారింజ, మొక్కజొన్న, మాంసం, చేపలు, హస్త కళాఖండాలు ఎగుమతుల జాబితాలో ఉన్నాయి.
కొరతను అధిగమించి...
తెలంగాణకు సముద్ర తీరం లేదు. కేవలం వైమానిక మార్గాలే హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నాయి. సముద్ర తీరం నుంచి ఎగుమతుల కోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కొరతను అధిగమించేందుకు బహుళ విధ రవాణా సేవల (మల్టీమోడల్ లాజిస్టిక్స్) పార్కుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాష్ట్ర ఎగుమతులను మరింత పోటీగా మార్చడమే గాకుండా ఎగుమతి ఆధారిత మౌలిక సదుపాయాల కల్పన కోసం చిన్న తరహా లాజిస్టిక్స్ పార్కులపై దృష్టి సారించింది. రహదారులను విస్తరించింది. కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టింది.
ఎగుమతుల్లో మొదటి ఎనిమిది జిల్లాలు
రాష్ట్రం నుంచి జరిగే ఎగుమతుల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా రెండోస్థానంలో ఉంది. ఔషధ, రసాయన, యంత్ర పరికరాల ఉత్పత్తులు, పారిశ్రామిక పార్కులు ఎక్కువగా ఉండటంతో రాజధాని చుట్టుపక్కల ఉండే జిల్లాలు అగ్రభాగాన ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.