స్కై‘రూటు’లో త్వరలో సమీకృత రాకెట్ తయారీ కేంద్రం
దేశంలో తొలిసారిగా తెలంగాణలో సమీకృత రాకెట్ ఆకృతి(డిజైన్), తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.
అభినందన సభలో మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణలో సమీకృత రాకెట్ ఆకృతి(డిజైన్), తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. రాష్ట్రానికి చెందిన స్కైరూట్ సంస్థ స్థాపించనున్న ఈ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. దేశ అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన సంస్థకు హైదరాబాద్ వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడే రాకెట్ను రూపొందించడంతో పాటు తొలి ప్రయత్నంలోనే దానిని విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్ సంస్థ దేశం గర్వించేలా చేసిందన్నారు. ఈ స్ఫూర్తితో హైదరాబాద్ అంతరిక్ష సాంకేతికతకు రాజధానిగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అంతరిక్ష సాంకేతిక(స్పేస్టెక్) విధానంతో తెలంగాణలో రాకెట్ల తయారీతో పాటు ప్రయోగాలకూ అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. స్కైరూట్ మాదిరే హైదరాబాద్ కేంద్రంగా మరో అంకుర సంస్థ ధృవ కూడా త్వరలోనే ఉపగ్రహ ప్రయోగం చేసి, రాష్ట్ర ఘనతను చాటనుందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ అభినందన సభ శుక్రవారం టీహబ్లో జరిగింది. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, స్కైరూట్ సహవ్యవస్థాపకులు పవన్కుమార్ చందన, నాగభరత్ డాక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా ఎదిగిన స్కైరూట్ అంతరిక్షంలో తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్ను ప్రయోగించింది. భవిష్యత్తులోనూ ఈ సంస్థ మరింతగా దూసుకెళ్లనుంది. తొలి ప్రయోగం విజయవంతం కావడంతో తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయం. ఆ సంస్థ భవిష్యత్ ప్రణాళిక అమలుకు సహకరిస్తాం. స్కైరూట్ విజయంతో హైదరాబాద్, టీహబ్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగాయి.. స్కైరూట్ సంస్థ ప్రతినిధుల సమష్టికృషితోనే ఇది సాధ్యమైంది. రాకెట్ తయారీ అంటేనే పెట్టుబడిదారులు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. స్కైరూట్ విజయంతో ఈ ధోరణి మారి, పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. స్కైరూట్ విజయం అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. బాలలకు చిన్నతనం నుంచే అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించాలి’’ అని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ సర్కారు అండతో... స్కైరూట్
పవన్కుమార్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రభుత్వంతో పాటు అంతరిక్ష రంగానికి సంబంధించిన విభిన్న రంగాలకు అవసరమైన నిపుణుల అందుబాటు, పర్యావరణ వ్యవస్థ వల్లనే మా విక్రం-ఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. 2018లో ప్రారంభించిన సంస్థ నాలుగేళ్లలోనే రాకెట్ను సిద్ధం చేసింది. ఒక అద్భుత ఆలోచనకు ఊతమిచ్చేలా టీ హబ్, టీవర్క్స్ పనిచేస్తున్నాయి. స్కైరూట్ ప్రస్థానంలో ఈ రెండింటి పాత్ర మరువలేనిది. మాకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు. 200 మంది స్కైరూట్ ఉద్యోగుల కష్టం ఫలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా మా సంస్థను విస్తరిస్తాం’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!