ఉమ్మడి సౌరవిద్యుత్పై ఉత్సాహం
ఉమ్మడి సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి కొంతమొత్తం వెచ్చించి సౌరవిద్యుత్ పెట్టించుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండనందున ఆ రూపేణా వారు లబ్ధిపొందుతున్నారు.
అపార్టుమెంట్లు, కాలనీలకు ఒకే కరెంటు మీటరు
యూనిట్కు రూ.7.30 చొప్పున సాధారణ ఛార్జీ
అందరికీ కలిపి ఏర్పాటుతో దిగివస్తున్న బిల్లు
ఏర్పాటు వ్యయంలో కేంద్రం రాయితీ 20 శాతం
గ్రేటర్ హైదరాబాద్లో లబ్ధి పొందుతున్న గేటెడ్ కమ్యూనిటీలు
ఈనాడు, హైదరాబాద్: ఉమ్మడి సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి కొంతమొత్తం వెచ్చించి సౌరవిద్యుత్ పెట్టించుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండనందున ఆ రూపేణా వారు లబ్ధిపొందుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో భారీ అపార్ట్మెంటు కాంప్లెక్స్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలకు ఇలా ఉమ్మడిగా సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటుతో నెలకు రూ.లక్షల కరెంటు బిల్లు ఆదా అవుతోంది. ఒకసారి ఇలా ఉమ్మడి సౌరవిద్యుత్ ప్లాంటుకు వెచ్చించే సొమ్మంతా నాలుగైదేళ్లలోనే కరెంటు బిల్లు రూపంలో మిగులుతోందని, ఆపై వారికి పూర్తి ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్ రెడ్కో) అధ్యయనంలో గుర్తించారు. కొత్తగా నిర్మించే భారీ అపార్టుమెంట్లకు బిల్డర్లే ఉమ్మడి సౌరవిద్యుత్ ప్లాంటు ఏర్పాటుచేయించి కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ఉమ్మడి మీటరులో నమోదైన మొత్తం యూనిట్లకు కలిపి ఒకే బిల్లు అపార్టుమెంటు అసోసియేషన్ పేరుతో వస్తుంది. ఏ ఫ్లాటులో ఎంత విద్యుత్ వినియోగించారనేది సబ్మీటర్లలో పరిశీలించి ఆ మేరకు బిల్లును అసోసియేషన్ ఇస్తుంది. దీనివల్ల సాధారణ కరెంటుతో పోలిస్తే నెలవారీ బిల్లు చాలా వరకూ తగ్గిపోయిందని పలువురు చెప్పారు.
ఉమ్మడి మీటరుతో ప్రయోజనాలు...
సాధారణంగా ఒక అపార్టుమెంటులో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. వాటి నెలవారీ కరెంట్ వినియోగాన్ని డిస్కం సిబ్బంది ‘లోటెన్షన్-ఎల్టీ-1’ విభాగంలో యూనిట్లవారీగా లెక్కగట్టి బిల్లు వసూలు చేస్తారు. ఒక ఫ్లాటులో నెలకు విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే సగటున యూనిట్కు రూ.10 వరకూ బిల్లు వచ్చే అవకాశముంది. అపార్టుమెంట్ కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీలు, సామాజిక కాలనీల్లో ఉండేవారికి ఇలా కరెంటు బిల్లు అదనపు భారం కాకుండా ‘ఉమ్మడి కరెంటు మీటరు’(సీసీఎం) విధానాన్ని డిస్కంలు అమలుచేస్తున్నాయి. అంటే ఫ్లాట్లకు మీటర్లు విడివిడిగా పెట్టకుండా భవనం మొత్తానికి కలిపి సీసీఎంను డిస్కం ఏర్పాటుచేస్తుంది. ఒకే కరెంటు కనెక్షన్ ఇచ్చి బిల్లును నెలనెలా ‘అపార్టుమెంటు అసోసియేషన్’ పేరిట పంపుతుంది. ఇలా సీసీఎం ఏర్పాటుకు విద్యుత్ టారిఫ్ ఉత్తర్వులో ప్రత్యేకంగా ‘హైటెన్షన్-6-టౌన్షిప్లు, రెసిడెన్షియల్ కాలనీలు’ పేరుతో కనెక్షన్ను డిస్కం ఇస్తుంది. దీనికి ఏకమొత్తంగా యూనిట్కు రూ.7.30 చొప్పున బిల్లు వేస్తుంది. అదే సాధారణ ఎల్టీ-1 కేటగిరీలో అయితే ప్రతీ 100 యూనిట్లకు ఈ రేటు పెరిగిపోయి యూనిట్కు రూ.10 దాటుతుంది. సీసీఎం పెట్టి హైటెన్షన్-6 కేటగిరీలో కనెక్షన్ తీసుకున్న అపార్టుమెంట్లకు సాధారణ విద్యుత్ బిల్లు కూడా కొంత తగ్గుతుంది. సీసీఎం పెట్టాక అదే భవనంపై సౌరవిద్యుత్ ఏర్పాటుచేసుకుంటే కరెంటు చాలావరకూ మిగులుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
ఆదా ఎలా..
ఉదాహరణకు ఒక అపార్టుమెంటులో 50 ఫ్లాట్లుంటే, వాటికి నెలకు 20వేల యూనిట్ల కరెంటు వాడుతున్నారనుకుందాం. భవనానికి విడివిడిగా పెట్టినవి తీసేసి.. ఉమ్మడి మీటరు పెడితే యూనిట్కు రూ.7.30 చొప్పున 20వేల యూనిట్లకు నెలకు దాదాపు రూ.లక్షన్నర బిల్లు వస్తుంది. అంటే ఏడాదికి రూ.18లక్షల బిల్లు కడుతున్నట్లు. అదే భవనంపై 130 కిలోవాట్ల సామర్థ్యంగల సౌరవిద్యుత్ ఫలకాలు పెడితే.. కిలోవాట్కు రోజుకు సగటున 5 యూనిట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తవుతుంది. మొత్తం 130 కిలోవాట్లకు నెలకు 20,150 యూనిట్ల కరెంటు వస్తుంది. అంటే నెలకు డిస్కంకు ప్రస్తుతం కడుతున్న రూ.లక్షన్నర కరెంటు బిల్లు ఇక రాదు. మరి 130 కిలోవాట్ల సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటుకయ్యే మొత్తం ఖర్చు రూ.65లక్షల్లో కేంద్ర రాయితీ 20% తీసేస్తే దాదాపు రూ.55లక్షలు అవుతుంది. సగటున ఫ్లాటు యజమాని రూ.లక్షా 10వేలు అసోసియేషన్కు ఇచ్చి సీసీఎంతో సౌరవిద్యుత్ పెట్టించుకుంటే నెలవారీ కరెంటు బిల్లు తగ్గిపోతుందని ‘సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్’ సంస్థ ఎండీ భవానీప్రసాద్ ‘ఈనాడు’కు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన