క్షేమంగా వెళ్లొద్దాం అయ్యప్పా
కొవిడ్ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు.
శబరిమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ
పిల్లలు తప్పిపోకుండా రేడియో ట్యాగ్ల సౌకర్యం
పెద్దలు మోకాళ్లకు క్యాప్ ధరించడం శ్రేయస్కరం
నడవలేని వారికి డోలీ ఛార్జి రూ.5,200
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ అంతరాయాలతో గత రెండేళ్లుగా శబరిమల వెళ్లలేకపోయిన భక్తులు.. ఈసారి మండల పూజలు ప్రారంభమైన నవంబరు 16 నుంచే పెద్దఎత్తున అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్తున్నారు. 41 రోజుల దీక్ష చేసిన వారితో పాటు.. మాలధారణ చేయకుండా దర్శనానికి వెళ్లేవారూ ఎక్కువగానే ఉంటున్నారు. ఒక్క మండల కాలం (నవంబరు 16- డిసెంబరు 27)లోనే 4 కోట్ల మందికి పైగా శబరిమలకు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో మాలధారణ చేసిన బాలలు తప్పిపోకుండా కేరళ పోలీసులు వేస్తున్న ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ఈసారి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. వెడల్పు తక్కువగా ఉండే కొండ ప్రాంత రహదారులపై వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. తొలివారంలోనే రెండు భారీ ప్రమాదాలు జరగ్గా, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 40 మంది గాయపడ్డారు కూడా. అందువల్ల జాగ్రత్తలు పాటిస్తూ వెళ్లి, రావడం శ్రేయస్కరం.
వర్చువల్ క్యూలో నమోదు
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మండల పూజల నిమిత్తం ఈ నెల 16న తెరిచారు. డిసెంబరు 27 వరకు భక్తులు దర్శించుకోవచ్చు. మళ్లీ మకరజ్యోతి పూజల కోసం డిసెంబరు 30 నుంచి.. జనవరి 20 వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. సంక్రాంతి రోజైన జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు; మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్పను దర్శించుకోవచ్చు. ఆధార్ నంబరుతో వర్చువల్ క్యూలో ఉచితంగా పేరు నమోదు చేసుకుంటే, నిర్ణీత సమయానికి దర్శనానికి వెళ్లొచ్చు. నీలక్కల్, పంబ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా పేరు, ఆధార్ నమోదు చేశాకే కొండపైకి పంపుతున్నారు.
కేరళ ఆర్టీసీ మేలు
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైవేటు వాహనాల్లో, ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అధికంగానే ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్లు, వ్యాన్ల వంటి చిన్న వాహనాలను పంబ వరకు..బస్సులను నీలక్కల్ వరకు అనుమతిస్తున్నారు. వాహనాలన్నీ పంబకు 20 కిలోమీటర్ల దూరంలోని నీలక్కల్ వద్ద పార్క్ చేయాల్సి ఉంటుంది. భక్తులు రానుపోను ప్రయాణాల్లో పంబ - నీలక్కల్ మధ్య నిరంతరం అందుబాటులో ఉండే కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మేలు. చెంగనూరు, కొట్టాయం రైల్వేస్టేషన్ల నుంచి కూడా 24 గంటలూ బస్సులు నడుస్తూనే ఉన్నాయి.
* ప్రైవేటు వాహనాల్లో వెళ్తున్న వారు, తమ డ్రైవరుకు కేరళ ఘాట్రోడ్లలో నడిపిన అనుభవం ఉందో, లేదో తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. వాహనం సామర్థ్యాన్ని (ఫిట్నెస్) ముందే తప్పనిసరిగా పరీక్షించుకోవాలి.
* రైళ్లలో వెళ్లే వారు.. స్థానికంగా కేరళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడమే క్షేమకరం.
బస్ఛార్జీలు ఇలా
నీలక్కల్-పంబ: ఏసీ బస్సు రూ.80 నాన్ ఏసీ రూ.50
చెంగనూరు-పంబ: నాన్ ఏసీ బస్సు రూ.180-225
కొట్టాయం-పంబ: నాన్ ఏసీ బస్సు రూ.295-424
మోకాళ్లకు క్యాప్ పెట్టుకోవాలి
పంబ నుంచి అయ్యప్ప సన్నిధానానికి చేరేందుకు నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తి మీదుగా ఆరు కిలోమీటర్ల మేర ఉన్న కొండ మార్గంలో కాలినడకన ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మెట్ల మార్గాన్ని విస్తరించి, ఏటవాలు శ్లాబుగా మారుస్తున్నారు. దీనివల్ల అధిక శ్రమతో పాటు, మోకాళ్లపై తీవ్ర భారం పడుతోంది. అందువల్ల మోకాళ్ల సమస్యలున్న వారు తప్పనిసరిగా నీ క్యాప్ ధరించడం మేలు.
డోలీ ఛార్జీ రూ.5200
నడవలేని వారి కోసం నలుగురు మనుషులు మోసుకెళ్లే డోలీలు అందుబాటులో ఉంటాయి. పంబ నుంచి సన్నిధానం వరకు తీసుకెళ్లి, తిరిగి తీసుకువచ్చేందుకు రూ.5000 ఛార్జీని దేవస్థానం నిర్ణయించింది. రూ.200 రిజిస్ట్రేషన్ రుసుము అదనం. పంబ గణపతి ఆలయం దాటాక, ఈ బుకింగ్ కార్యాలయం ఉంటుంది. రద్దీని బట్టి, మనిషి బరువును బట్టి ఈ ఛార్జీలు బాగా మారుతున్నాయి.
చిన్న పిల్లలకు భద్రత
శబరిమల వస్తున్న 14 ఏళ్లలోపు పిల్లలకు పంబ గణపతి ఆలయం దాటాక, చేయి/మెడకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్లు వేస్తున్నారు. పిల్లలు రద్దీలో తప్పిపోయినా వెంటనే కనిపెట్టేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. చిన్నారి పేరు, తీసుకువచ్చిన వ్యక్తి పేరు, వివరాలు, ఫోన్ నంబరు ట్యాగ్పై నమోదు చేస్తారు. పిల్లలు తప్పిపోతే.. వెంటనే ఫోన్ చేసి, అప్పగిస్తున్నారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే పవర్బ్యాంక్ తీసుకెళ్లాలి.
ప్రత్యేక దర్శనాలు లేవు: మంత్రులు, ఉన్నతాధికారులతో లేఖలు తీసుకెళ్తే, గతంలో అయ్యప్ప గర్భగుడి సమీపానికి అనుమతించేవారు. ఇప్పుడది రద్దు చేశారు. ఈ ప్రత్యేక పూజలకు రుసుము కడితే, స్వామిని కనులారా దర్శనం చేసుకోవచ్చు.
గణపతి పూజ: రూ.375 (స్వామి గర్భాలయం ఎదురుగా ఉన్న మండపంపై ఈ పూజ తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుంది.)
పుష్పార్చన: రూ.12,500 (రాత్రి 7 గంటల నుంచి 9.30 మధ్య జరుగుతుంది. ఏడుగురిని స్వామి గర్భగుడి సమీపానికి అనుమతిస్తారు. భక్తులు తీసుకెళ్లే పుష్పాలతో అర్చన చేస్తారు.)
* కేరళ ఆర్టీసీ టికెట్లు, శబరిమల పూజలు, అక్కడ అద్దె గదులకు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM