ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆ ఇద్దరిపై గురి!
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిని ఈ నెల 29న న్యాయస్థానానికి నివేదించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.
తుషార్, జగ్గుస్వామి వేటలో సిట్ బృందాలు
కీలక సమాచారం లభ్యమవుతుందని అంచనా
రెండోరోజూ కొనసాగిన ప్రతాప్గౌడ్ విచారణ
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిని ఈ నెల 29న న్యాయస్థానానికి నివేదించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన భాజపా కీలకనేత బీఎల్ సంతోష్తోపాటు డా.జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ పాత్రను నిగ్గు తేల్చడంపై కసరత్తు చేస్తోంది. వీరిలో శ్రీనివాస్ ఒక్కరే ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరయ్యారు. బీఎల్ సంతోష్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి ఊరట పొందారు. మిగిలిన ఇద్దరూ స్పందించకపోవడంతో సిట్ వీరిపై లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్వోసీ) జారీ చేసింది. వీరిద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు సిట్ భావిస్తోంది. వాస్తవానికి డా.జగ్గుస్వామి సిట్ బృందం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నోటీసు ఇచ్చేందుకు నల్గొండ ఎస్పీ (సిట్ సభ్యురాలు) రెమా రాజేశ్వరి బృందం కొచ్చిలోని అమృత ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అతడు ఆసుపత్రి క్వార్టర్లోనే ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులొచ్చారన్న సమాచారం తెలిసి.. అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సిట్ గుర్తించింది. 41ఏ సీఆర్పీసీ నోటీసును నేరుగా అందుకున్నవారు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే అనుమానితులు నోటీసులు అందుకోకుండా తప్పించుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పెద్దలకు వారధులుగా ఆ ఇద్దరు
ఈ వ్యవహారంలో కీలక పెద్దలున్నారని.. వారికి, నిందితులకు మధ్య తుషార్, జగ్గుస్వామి అనుసంధానకర్తలుగా ఉన్నారని సిట్ విశ్వసిస్తోంది. నిందితుడు రామచంద్రభారతిని తుషార్తో కలిపించింది డా.జగ్గుస్వామి అని సిట్ అనుమానం. ఫామ్హౌస్లో ఉండగా.. ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని రామచంద్రభారతి.. తుషార్తో మాట్లాడించారు. తుషార్, జగ్గుస్వామిలను విచారిస్తే.. కీలక సమాచారం, ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు.
8 గంటలపాటు విచారణ
అనుమానితుల విచారణలో భాగంగా అంబర్పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ శనివారం సిట్ కార్యాలయానికి వచ్చారు. రెండోరోజు ఆయన్ని సిట్ బృందం దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించింది. నిందితులతో అతడికున్న ఆర్థిక లావాదేవీల విషయంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది.
రెండు రోజుల కస్టడీకి నందకుమార్
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో నిందితుడైన నందకుమార్ను రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఫిలింనగర్ రోడ్ నంబరు 1, ప్లాట్ నంబరు 3లో ఉన్న దగ్గుబాటి కుటుంబసభ్యులకు చెందిన స్థలం సబ్లీజు వ్యవహారంలో నందకుమార్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని కస్టడీకి ఇవ్వాలంటూ వారం కిందట 3వ అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని శనివారం పరిశీలించిన కోర్టు.. సోమ, మంగళవారాల్లో కస్టడీకి అనుమతించిందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది.