ఎస్సీ ఉపకారవేతనాలకు నిలిచిన రూ.500 కోట్లు!
రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన రుసుములకు నిధుల కష్టాలు మొదలయ్యాయి.
రెండేళ్లుగా కేంద్ర వాటా నిధులు బంద్..!
బోధన రుసుములు విద్యార్థులకు నేరుగా ఇవ్వాలన్న కేంద్రం
ఆ నిబంధనకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన రుసుములకు నిధుల కష్టాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయకపోవడంతో రెండేళ్లుగా కేంద్రం వాటా కింద రావాల్సిన దాదాపు రూ.500 కోట్లు నిలిచిపోయాయి. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులు జమచేయాలన్న నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం ఇందుకు కారణమైంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధన తెలంగాణలో ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించిన కేంద్ర సామాజిక న్యాయశాఖ.. ప్రభుత్వం పూచీకత్తుగా కళాశాలలకు నేరుగా చెల్లించడం కాకుండా, విద్యార్థుల ఖాతాల్లో జమచేసేలా నిబంధనలు సవరించాలని స్పష్టం చేసింది. అప్పుడే నిధులిస్తామనడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ ఎస్సీ సంక్షేమశాఖ ఏడాది క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు వాటిపై ఎలాంటి నిర్ణయమూ రాకపోవడంతో కేంద్రం నిధులందక, రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనాలు, బోధన ఫీజులు మంజూరు చేసి, టోకెన్లు ఇచ్చినా, ట్రెజరీల్లో నిలిచిపోయాయి. ఎస్సీలకు పూర్తి ఫీజులు చెల్లించేందుకు మరో రూ.140కోట్ల నిధులు అవసరమని అంచనా.
కేంద్రం వాటా పెరిగినా..!
ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు గతంలో కేంద్రం 15శాతం నిధులిస్తే... మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించేది. 2021 నుంచి ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన ఫీజుల డిమాండ్లో 60శాతం నిధులు భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ లెక్కన 2021-22 ఏడాదికి రూ.250 కోట్లు వస్తాయని ఎస్సీ సంక్షేమశాఖ అంచనా వేసింది. బోధన ఫీజులను ప్రభుత్వం కళాశాలలకు చెల్లించకుండా విద్యార్థుల ఖాతాలో వేయాలని సూచించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా విడుదల చేశాక, తమ వంతు నిధులు వెంటనే ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే.. బోధన ఫీజుల విధానం కింద ప్రభుత్వం కళాశాలలకు హామీ ఇచ్చి చెల్లిస్తున్నందున, విద్యార్థులకు నేరుగా ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం వాటా రాష్ట్రమే భరిస్తుందని, ఆ మేరకు ఉపకారవేతనాలు మంజూరు చేయాలని నోటిమాట కింద చెప్పినట్లు తెలిసింది. కేంద్ర సంస్కరణ అమలు కానందున అక్కడి నుంచి నేటి వరకు రూపాయైనా రాలేదు.
నిలిచిన ఆటోరెన్యువల్ సంస్కరణ..
ఉపకారవేతనాలు, బోధన రుసుముల కోసం ఏటా విద్యార్థి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సకాలంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువు పొడిగిస్తున్నారు. విద్యార్థుల డేటాబేస్ పూర్తిగా ఆన్లైన్ అయిన నేపథ్యంలో.. ఏటా దరఖాస్తు అవసరం లేకుండా ఆటోమేటిక్ రెన్యువల్ విధానం అమల్లోకి వచ్చేలా సంస్కరణలు రూపొందించింది. ఈ-పాస్లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పీజీ పూర్తయ్యే వరకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు పొందేలా మార్పులు చేయాలని భావించింది. జిల్లా సంక్షేమ అధికారులు కాగితరూప దరఖాస్తులు తీసుకోవద్దని నిబంధనల్లో చేర్చింది. ఆధార్ ధ్రువీకరణ, సెట్ల, సర్టిఫికెట్ల సమాచారాన్ని డిజీలాకర్ నుంచి నేరుగా తీసుకుని ఆటోమేటిక్గా దరఖాస్తు అప్డేట్ అయ్యేలా ఈ-పాస్లో సవరణ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సంక్షేమశాఖ దస్త్రం సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపినా.. అక్కడ ఆమోదం లభించకపోవడంతో పాతపద్ధతినే అనుసరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్