ఎందుకింత ‘చలి?’
మొన్నటిదాకా ఉన్నపళంగా కుండపోత వర్షాలు చూశాం.. అంతకుముందు ఠారెత్తించే ఎండలు.. ఇప్పుడు అమాంతం పెరుగుతున్న చలితో వణికిపోతున్నాం.
వాతావరణ మార్పులతోనే అనర్థాలు
జాగ్రత్త పడకపోతే ముందు తరాలకు ముప్పే..
పచ్చదనం పరిరక్షణ.. కాలుష్య నియంత్రణ ప్రధానం
‘ఈనాడు’తో వాతావరణశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగరత్న
ఈనాడు, హైదరాబాద్
మొన్నటిదాకా ఉన్నపళంగా కుండపోత వర్షాలు చూశాం.. అంతకుముందు ఠారెత్తించే ఎండలు.. ఇప్పుడు అమాంతం పెరుగుతున్న చలితో వణికిపోతున్నాం. వాతావరణంలో అనూహ్యంగా ఎందుకీ మార్పులు? భవిష్యత్తులో విపత్కర పరిస్థితులకు ఇవి సంకేతాలా? మనమంతా ఏంచేయాలి? ఇలాంటి ఎన్నో అంశాలపై వాతావరణ శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ నాగరత్న వివరాలను వెల్లడించారు. ప్రజలంతా జాగ్రత్తపడకపోతే ముందుతరాలు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు.. ప్రభావాలపై ఆమె ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.
వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై ఎలా ఉంది?
వాతావరణాన్ని ఉష్ణోగ్రతల లెక్కల ఆధారంగా పరిశీలిస్తాం. ప్రతి 30ఏళ్ల సగటును తీసుకుని అంతకన్నా ఇప్పుడు ఎక్కువుందా? తక్కువుందా? అనేది అధ్యయనం చేస్తాం. గత 30 ఏళ్ల సగటును, అంతకుముందు 30 సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణలో 0.5 డిగ్రీలు పెరిగింది. ఈ కాస్త పెరుగుదల వల్లనే ఇటీవల కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, అనూహ్యంగా పెరుగుతున్న చలి, ఇతర విపత్తులను చూస్తున్నాం. భారీవర్షాలతో పంటలు నీట మునగడం, ఇతర నష్టాలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణం. సగటు ఉష్ణోగ్రత మరో 0.5 డిగ్రీలు పెరిగితే నష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయి.
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి కదా?
రాష్ట్ర సగటు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలే పెరిగింది. ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వాతావరణం వల్ల ఐదారు డిగ్రీలు పెరగొచ్చు. దాన్ని ప్రాతిపదికగా తీసుకోం. ఉదాహరణకు ఆదిలాబాద్ దక్కన్ పీఠభూమిలో ఉంది. అక్కడున్న అడవులు, ఇతర కారణాల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్కేంద్రాల వల్ల అధిక వేడి ఉంటుంది.
కార్బన్ డై ఆక్సైడ్ విడుదల వల్ల రాష్ట్రంలో ఉష్ణతాపం పెరుగుతోందా?
అదొక్కటే కాదు.. పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, వరిసాగు పెరగడం వల్ల కూడా కాలుష్యకారక వాయువులు విడుదలవుతున్నాయి. వరిసాగు విస్తీర్ణం లక్షలాది ఎకరాలు అదనంగా పెరిగింది. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల మిథేన్ వాయువు అధికంగా విడుదలై వాతావరణంలో మార్పులు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. కాలుష్యాన్ని తగ్గించాలి.
వాతావరణ పరిరక్షణకు ప్రజలు ఏంచేయాలి?
ఎంతో అవసరమైతే తప్ప చెట్లు నరకవద్దు. ప్రతిఒక్కరూ ఒక మొక్కను పెంచితే ఏడాది తిరిగేసరికల్లా తెలంగాణలో 4 కోట్ల మొక్కలు అదనంగా పెరుగుతాయి. బొగ్గును మండించడంతో కాలుష్యాన్ని విడుదల చేసే థర్మల్ విద్యుదుత్పత్తిని అనేక దేశాల్లో తగ్గించి సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని పెంచుతున్నారు. హైదరాబాద్లో కాలుష్యం, కాంక్రీట్ భవనాల కారణంగా వేడి సాధారణం కన్నా అధికంగా ఉంటోంది. ఇప్పటికే దిల్లీలో కాలుష్యంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనం అప్రమత్తం కాకపోతే అతిత్వరలో హైదరాబాద్లో కాలుష్యం కూడా దిల్లీస్థాయికి చేరే అవకాశాలున్నాయి. ప్రతి చిన్నపనికి కాలుష్యం వదిలే వాహనాలు కాకుండా సైకిళ్లు వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి.
రాష్ట్రంలో అదనంగా వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా?
ప్రస్తుతం 12 చోట్ల ఉన్నాయి. మొత్తం 33 జిల్లాకేంద్రాల్లో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు పెట్టడానికి స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను అడుగుతున్నాం. పాలమూరు విశ్వవిద్యాలయంలో స్థలం ఇస్తే వాతావరణ కేంద్రం పెడతామని అడిగాం. త్వరలో వీటి ఏర్పాటు పనులు మొదలుపెడతాం.
రహదారుల వెంట అశోకుడు మొక్కలు నాటించెను.. అని పిల్లలకు పాఠాలు చెబుతుంటాం. పెద్దలు దాన్ని సక్రమంగా పాటిస్తే వాతావరణం పాడవదనే చిన్నసత్యాన్ని అందరూ గ్రహిస్తే అతివృష్టి, గడ్డకట్టే చలి, వడగండ్లు, కరవు వంటి విపత్తులు పెద్దగా రావు. వాతావరణ మార్పులు తెలంగాణపైనే కాదు.. దేశం మొత్తంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ‘వాతావరణం అంటే నాకు సంబంధం లేని విషయం’ అనే భావన చాలామందిలో ఉంది. అది సరికాదు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. పెరుగుతున్న కాలుష్యం, చెట్ల నరికివేత వల్ల భూ వాతావరణం బాగా వేడెక్కుతోంది. మానవాళి మనుగడకే సవాల్గా మారుతున్న ఈ ప్రమాదాన్ని గుర్తించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!