కబళిస్తున్న జీవనశైలి
తెలంగాణలో జీవనశైలి వ్యాధుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. పల్లెలకూ విస్తరిస్తున్నాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న మధుమేహం, హైబీపీ
గుండె, మెదడు సమస్యలతో మరణాలే ఎక్కువ
సిఫిలిస్, గనేరియా వ్యాధుల్లో మొదటి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2021 నివేదిక
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణలో జీవనశైలి వ్యాధుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. పల్లెలకూ విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2020లో ఒక్క ఏడాదిలోనే 6,81,268 పరీక్షల ద్వారా.. కొత్తగా 34,063 మంది మధుమేహులు, 81,739 మంది అధిక రక్తపోటు బాధితులు, 27,252 మంది షుగర్, హైబీపీ రెండూ ఉన్నవారు, 5,270 మంది పక్షవాతం వ్యాధిగ్రస్తులు, 1,091 మంది క్యాన్సర్ రోగులను నిర్ధారించారు. మొత్తంగా అధిక రక్తపోటు బాధితులు సుమారు 16 శాతం, మధుమేహులు సుమారు ఏడు శాతం మంది కొత్తగా నమోదయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అసాంక్రమిక వ్యాధులు (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్- ఎన్సీడీ) క్లినిక్లలో పరీక్షలు చేయించుకుని.. చికిత్స పొందుతున్న వారి గణాంకాలివి. రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో గుండె, మెదడు, తదితర రక్తప్రసరణ వ్యాధుల కారణంగా సంభవించేవే అధికంగా (56 శాతం) ఉండడం గమనార్హం. సిఫిలిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండడం దృష్టి పెట్టాల్సిన అంశం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2021’ నివేదికలో దేశవ్యాప్తంగా వ్యాధుల తీవ్రత, వాటి ప్రభావాన్ని వివరించింది. రాష్ట్రంలో 2020 నాటి ఆ గణాంక వివరాలిలా ఉన్నాయి...
పురుషుల ఆత్యహత్యలే అధికం
ఆత్మహత్యల్లో పురుషుల సంఖ్యే అత్యధికం. మొత్తం 5,612 మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడగా.. వారిలో అత్యధికంగా 1902 మంది 30-45 ఏళ్ల వారే. ఆత్మహత్య చేసుకున్న మహిళలు 2,062 మంది కాగా.. అత్యధికంగా 18-30 ఏళ్ల మధ్యవయస్కులు 662 మంది ఉన్నారు.
గణనీయంగా తగ్గిన మలేరియా, డెంగీ
మలేరియా కేసులు గత అయిదేళ్లలో తగ్గుముఖం పట్టాయి. 2016లో 3,512 కేసులు నమోదు కాగా.. 2017లో 2,688, 2018లో 1,792, 2019లో 1,711, 2020లో 870 మందిని గుర్తించారు. దేశమంతటా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. 2019లో అత్యధికంగా 13,331 డెంగీ కేసులు నమోదు కాగా.. 2020లో 2,173కి తగ్గాయి.
కలవరపెడుతున్న డయేరియా
1,85,362 మంది పురుషులు డయేరియా బారినపడగా.. 45 మంది మృతి చెందారు. 1,81,174 మంది మహిళలకు ఈ వ్యాధి సోకగా.. 47 మంది మరణించారు. ఒక్క 2020లోనే డయేరియా 92 మందిని పొట్టన పెట్టుకుంది. 68,280 టైఫాయిడ్ కేసులు కూడా నమోదయ్యాయి.
సుఖవ్యాధుల ముప్పు
రాష్ట్రంలో సుఖవ్యాధుల ముప్పు పెరుగుతోంది. సిఫిలిస్ వ్యాధిగ్రస్తులు 3,137 మంది నమోదవగా.. వారిలో 1,318 మంది పురుషులు, 1,819 మంది మహిళలు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ (10,671) ముందుండగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గనేరియా (గోనకొకల్ వైరస్) ఇన్ఫెక్షన్లలోనూ ఆంధ్రప్రదేశ్ (11,061) ముందు వరుసలో ఉండగా.. తెలంగాణ 5,264 కేసులతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో హెచ్ఐవీతో చికిత్స పొందుతున్న రోగులు 1,10,178 మంది ఉన్నారు.
ఒక్క విద్యార్థికీ కళ్లజోళ్లు ఇవ్వలేదు
2020-21లో 1,75,380 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించాలనేది లక్ష్యం కాగా.. 94,772 మందికి సర్జరీలు చేశారు. 21,460 మంది బడి పిల్లలకు కళ్లద్దాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఒక్కరికీ ఇవ్వలేదు. 4,000 నేత్రదానాల లక్ష్యంలో 2,091 మాత్రమే చేయగలిగారు.
వేధిస్తున్న ఫ్లోరోసిస్: రాష్ట్రంలో 12,885 మందికి ఫ్లోరోసిస్ పరీక్షలు చేయగా.. 4,920 మందికి దంత సమస్యలున్నట్లు, 3,223 మందికి ఎముకలు బలహీనపడినట్లు తేలింది. 5,119 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 2,776 మందిలో దంత సమస్యలు బయటపడ్డాయి.
శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో..
అత్యవసర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కారణంగా 3,16,468 మంది పురుషులు చికిత్స పొందగా.. ఏడుగురు చనిపోయారు. 3,10,410 మంది మహిళలు దీని బారినపడగా ఒకరు కన్నుమూశారు. న్యుమోనియా 6,152 మందికి సోకగా.. తొమ్మిది మంది మృతిచెందారు. తెలంగాణలో 2019లో 71,368 క్షయ కేసులు నమోదు కాగా.. 2020లో 63,366 మంది రోగులను గుర్తించారు. స్వైన్ఫ్లూ కేసులు 2019లో 1,388 నమోదవగా.. 22 మంది మరణించారు. 2020లో 446 కేసులు.. అయిదు మరణాలు నమోదయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి
-
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!