శుద్ధి సిద్ధించేదెలా?
రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు భూముల కొరత అడ్డంకిగా మారింది. 33 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2012 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.
భూముల కొరతతో ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్ల ఏర్పాటులో జాప్యం
ఏడాదిన్నరగా 2012 మంది పారిశ్రామికవేత్తల నిరీక్షణ
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు భూముల కొరత అడ్డంకిగా మారింది. 33 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2012 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. సేకరిస్తున్న భూముల కంటే ఎక్కువగా దరఖాస్తులు రావడంతో కేటాయింపుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అందుబాటులో ఉన్న భూములను కేటాయించాలా? లేక అదనంగా భూములను సేకరించాలా? అని ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది. ఈ ప్రత్యేకమండళ్ల ఏర్పాటు కోసం 2021 జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తంగా పదివేల ఎకరాల్లో వీటిని ప్రారంభించాలని ఆదేశించారు. దీనిపై పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. వరి, మిర్చి, జొన్న, పసుపు, ఆయిల్పామ్, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, మాంసం, చేపల మార్కెటింగు ద్వారా అన్నదాతలతో పాటు నిరుద్యోగ యువతకు ఊతమివ్వాలని నిర్దేశించింది. వీటిలో మౌలిక సదుపాయాలైన విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ప్లగ్ అండ్ ప్లేతో గిడ్డంగుల నిర్మాణం చేపట్టి, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను రూపొందించింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో భూముల గుర్తింపునకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములను తీసుకోవాలని, అవి అందుబాటులో లేకపోతే సేకరణ చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ 2021 ఆగస్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి అనూహ్యంగా రెండు నెలల వ్యవధిలోనే 1500 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో ఎక్కువమంది రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, కోల్డ్స్టోరేజీలు, గిడ్డంగుల ఏర్పాటుపై ఆసక్తి చూపారు. ఆహార ఉత్పత్తుల పరిశ్రమల కోసం చాలామంది భూమిని అభ్యరించారు. ప్రభుత్వం భారీ ఎత్తున భూములు ఇస్తుందనే భావనతో ఒక్కో పారిశ్రామికవేత్త ఎకరం నుంచి అయిదు ఎకరాల భూమిని కోరారు.
భూములేవీ?
మొదట్లో నికరంగా 500 ఎకరాల్లో ఒక్కో ఆహారశుద్ధి ప్రత్యేకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏడాదిన్నరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తరచూ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు అతికష్టం మీద కొన్ని జిల్లాల్లో భూములు గుర్తించారు. వీటిలోనూ సగం జిల్లాల్లోనే ఈ లక్ష్యం మేరకు సేకరణ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో భూములు లభ్యమే కాలేదు.
ఎప్పుడిస్తారు?
ఆహారశుద్ధి ప్రత్యేకమండళ్లకు జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, నీటి వసతి తదితర సౌకర్యాలు విధిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా... ఆ మేరకు వసతులు గల భూములు ఎక్కువగా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. కొన్ని మినహాయింపుల అనంతరం భూసేకరణ జరిపాక ఈ లెక్కలు తేలాయి. భూముల లభ్యతను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని పరిగణనలోనికి తీసుకొని అధికారులు సమీక్ష జరపగా దాదాపు 20 జిల్లాల్లో దరఖాస్తుదారులు కోరిన వాటి కంటే తక్కువగా భూములున్నట్లు తేలింది. దీంతో అధికారులు ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటుపై సందిగ్ధంలో ఉన్నారు. 225కి పైగా ఎకరాలను సేకరించిన జిల్లాల్లో వెంటనే ప్రత్యేక మండళ్లను ప్రారంభించాలని యోచిస్తున్నా..మిగిలిన జిల్లాల నుంచి ఒత్తిళ్లు వస్తాయనే భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!