నిరంతర ప్రగతి
తెలంగాణలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని.. పెరుగుతున్న ఆర్థిక వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ప్రజావసరాలకు అనుగుణంగా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలి
సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలు ఆలోచించాలి
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
పురపాలకశాఖ అభివృద్ధిపై సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని.. పెరుగుతున్న ఆర్థిక వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలను అన్వేషించాలని, ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు మరింతగా చేరవేయగలుగుతామని తెలిపారు. ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఆదివారం ప్రగతిభవన్లో ఆయన పురపాలకశాఖ, నిజామాబాద్ నగర అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
ప్రజలు మరింత నాణ్యమైన సేవలు ఆశిస్తున్నారు
‘‘రాష్ట్రంలో వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మక ప్రగతి సాధించింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. దీంతో ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. వాటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉంది. మెరుగైన సౌకర్యాల కోసం రోజురోజుకూ డిమాండ్ పెరగడానికి ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసమే కారణం. దాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలి. గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే ఉండేది. నేడు పరిస్థితి మారిపోయింది. వర్షాలు లేని ఆరేడు నెలల కాలంలోనే అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
నిజామాబాద్లో అభివృద్ధి ద్విగుణీకృతం కావాలి
ప్రగతిపథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరంలో అభివృద్ధి ద్విగుణీకృతం కావాలి. పనులను రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి. నేను స్వయంగా పర్యటించి పరిశీలిస్తాను. పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, పురపాలిక తదితర అన్ని శాఖల సమన్వయంతో పనులను పూర్తి చేయాలి. నిధుల కొరత లేదు. ఇప్పటికే విడుదలైన నిధులతోపాటు అవసరమైనవి విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. నగరంలో కంకర రోడ్లను బీటీ రహదారులుగా మార్చాలి. శ్మశాన వాటికలు, సమీకృత మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, డంపింగ్ యార్డులు., మార్కెట్ల పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలి. ఆధునిక ధోబీఘాట్లను, సెలూన్లను నిర్మించాలి. గతంలో గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో సుందరంగా మారింది. అదే తరహాలో ఇందూరును తీర్చిదిద్దాలి. నిజామాబాద్ ప్రజాప్రతినిధులంతా కలిసి ఖమ్మం వెళ్లి.. అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలి. నేను నిజామాబాద్లో ఉన్నప్పుడు తరచూ తిలక్ గార్డెన్కు వెళ్లేవాడిని. ఇతర పార్కులతో పాటు దాన్ని పునరుద్ధరించాలి. రైల్వే స్టేషన్ను సుందరీకరించాలి. నగరంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజావసరాలకు వినియోగించాలి. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ నివేదించారు. నిజామాబాద్లో ఆడిటోరియం నిర్మాణం గురించి ప్రశాంత్రెడ్డి వివరించారు. నగరంలో విశాల స్థలంలో బస్టాండ్, క్రీడా ప్రాంగణం, హజ్ భవన్ నిర్మించాలని సీఎంను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. నిజామాబాద్ నగర ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, రోహిత్రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, కౌశిక్రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
నేడు దామరచర్లకు ముఖ్యమంత్రి
యాదాద్రి థర్మల్ ప్లాంటు పనుల పరిశీలన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్ నుంచి సీఎం బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అక్కడి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్కు వస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..