ఊపిరి ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో వాయు కాలుష్యం మాటెత్తగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. రాజధానిలోనే కాదు.. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లోనూ అది కోరలు చాస్తోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది.
పట్టణాల్లో వాయు కాలుష్యం కోరలు
మహబూబ్నగర్లో రాష్ట్రంలోనే అత్యధికంగా పీఎం10 ఉద్గారాల నమోదు
పెద్దపల్లిలో ఆరేళ్లలో 50 శాతం పెరుగుదల
రైస్మిల్లులు, అధ్వాన రోడ్లు, వాహనాల రద్దీ కారణం
ఈనాడు-హైదరాబాద్, ఈనాడు డిజిటల్-పెద్దపల్లి: రాష్ట్రంలో వాయు కాలుష్యం మాటెత్తగానే హైదరాబాద్ గుర్తొస్తుంది. రాజధానిలోనే కాదు.. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లోనూ అది కోరలు చాస్తోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్ తదితర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లో గాలిలో సూక్ష్మధూళి కణాలు(పీఎం10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో పలుచోట్ల 17 నుంచి 49 శాతం వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 52 చోట్ల కాలుష్య నమోదు కేంద్రాలున్నాయి. అక్కడి గణాంకాలనే పీసీబీ వెల్లడిస్తోంది. మిగతాచోట్ల కూడా కాలుష్యం ఎక్కువగానే ఉన్నా.. నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.
పెరుగుతున్న పీఎం10 ఉద్గారాలు..
సూక్ష్మ ధూళికణాలు(పీఎం10), అతిసూక్ష్మ ధూళికణాలు(పీఎం 2.5), ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన పీఎం10 ఉద్గారాలు పలు జిల్లాల్లో పెరుగుతున్నాయి.
ఇక్కడ తగ్గినా.. పరిమితి కంటే ఎక్కువే
2021లో హైదరాబాద్ సహా కొన్నిచోట్ల పీఎం10 ఉద్గారాలు తగ్గాయని పీసీబీ అధికారులు చెబుతున్నారు. మహబూబ్నగర్లో 100, మెదక్లో 89, మల్కాజిగిరిలో 89, హైదరాబాద్లో 84(నగర సగటు) గణాంకాలు నమోదయ్యాయి. అయితే నిర్దేశిత పరిమితి(40) కంటే ఇవి ఎక్కువే కావడం గమనార్హం. పైగా కొవిడ్ ప్రభావం లేకుంటే కాలుష్యం మరింత ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాలున్నాయి.
ఎందుకిలా..
పరిశ్రమలు, రైస్మిల్లులు, వాహనాల పొగ, స్టోన్ క్రషర్లు, అధ్వాన రహదారుల నుంచి వచ్చే దుమ్ము, చెత్త దహనం వంటివి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. స్థానికులు శ్వాసకోశ, నేత్ర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.
* కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 300 రైస్మిల్లులు ఉండగా వీటిలో 20 శాతం కూడా కాలుష్య నిబంధనలను పాటించట్లేదు. ధాన్యపు పొట్టు బయటకు రాకుండా కవర్లు, సంచులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 40 శాతం మిల్లులే పాటిస్తున్నాయి. 30 శాతం మిల్లుల్లో కాలంచెల్లిన యంత్రాలున్నాయి. 190 బాయిల్డ్, 70 రా రైస్ మిల్లుల యాజమాన్యాలకు పీసీబీ నోటీసులు జారీచేసినా పరిస్థితిలో మార్పు లేదు.
* కొత్తగూడెం-పాల్వంచ జంట పట్టణాల్లో 4 భారీ పరిశ్రమలు, 12 రైస్మిల్లులతో పాటు పరిసర ప్రాంతాల్లో 6 కంకర క్వారీలున్నాయి. దీంతోపాటు కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులు అధ్వానంగా ఉండటంతో దుమ్మూధూళి రేగి కాలుష్యానికి దారితీస్తోంది. మహబూబ్నగర్ శివారులో డజన్ వరకు స్టోన్ క్రషర్లున్నాయి. పట్టణం చుట్టూ గుట్టలను తవ్వి మొరం తరలిస్తున్నారు. దీంతో దుమ్మూధూళి బాగా పెరుగుతోంది.
* యాదాద్రి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంవంటి చోట్ల పరిశ్రమలు, రైస్ మిల్లులు, వికారాబాద్ జిల్లా తాండూరులో మైనింగ్తోపాటు సిమెంటు కర్మాగారాలు, నాపరాతి పరిశ్రమలు, పాలిషింగ్ యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాలుష్య నమోదు కేంద్రాలు లేక తీవ్రత తెలియని పరిస్థితి ఉంది. నిధుల లభ్యతను బట్టి ఈ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
* రైస్మిల్లులు పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలుగుతున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని రామగుండం పీసీబీ ఈఈ బిక్షపతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో