సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్కీ బాత్లో ఆదివారం ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘మన్కీ బాత్’లో ప్రత్యేక ప్రస్తావన
వస్త్రంపై జీ-20 చిహ్నం నేసి పంపించిన హరిప్రసాద్
ఈనాడు-దిల్లీ, హైదరాబాద్, ఈనాడు డిజిటల్-సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మన్కీ బాత్లో ఆదివారం ఆయన ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన చేనేత మగ్గంపై మూడు రోజులు శ్రమించి వస్త్రంపై జీ-20 చిహ్నం తయారు చేసి పంపారని, ఈ అద్భుతమైన బహుమతిని చూసి తాను ముగ్ధుడినయ్యానని ప్రధాని పేర్కొన్నారు. హరిప్రసాద్ కళా నైపుణ్యం అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కితాబునిచ్చారు. చేతితో నేసిన జీ-20 లోగోతో పాటు ఓ లేఖను హరిప్రసాద్ తనకు పంపారని, వచ్చే ఏడాది జరగనున్న జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం గర్వించదగ్గ విషయమని అందులో రాశారని వెల్లడించారు. ఆయనలా అందరూ ఏదో ఒకరకంగా జీ-20తో అనుసంధానం కావాలని ప్రధాని కోరారు. ప్రధాని ప్రశంసల నేపథ్యంలో ఆయనను ఎంపీ బండి సంజయ్ కరీంనగర్కు పిలిపించి ప్రత్యేకంగా అభినందించారు. హరిప్రసాద్ గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే, దబ్బనం, సూది రంధ్రాల్లో దూరే చీరలను నేశారు. ఇటీవల 15 రోజులపాటు శ్రమించి ఒకే వస్త్రంపై దేశ చిత్రపటం, జాతీయ గీతానికి రూపమిచ్చారు.
నేతన్నలకు మీరూ కానుక ఇవ్వాలి: కేటీఆర్
హరిప్రసాద్ తనకు పంపిన ప్రత్యేక బహుమతి గురించి ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ.. చేనేత కార్మికులకూ తిరిగి బహుమతి ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ఆదివారం కోరారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని, సిరిసిల్లలో మరమగ్గాల సమూహాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి భగభగ.. ‘ఆరెంజ్’ హెచ్చరికల జారీ
రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా... మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. -
న్యాయవాదులు సామాజిక ఇంజినీర్లు
‘నేను చదువుకునే రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులను తొలి ప్రాధాన్యంగా ఎంపికచేసేవారు. -
అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. -
టెండర్లు లేకుండా రూ.270 కోట్ల పనులు!
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా గుర్తించింది. -
కవితకు 15 రోజుల రిమాండ్
దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ బాధ్యతల స్వీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ మంగళవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే.. జస్టిస్ సుజయ్పాల్తో ప్రమాణం చేయించారు. -
నాగార్జునసాగర్ భద్రతపై సమగ్ర అధ్యయనం
నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని.. జాతీయ డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం ఇది తప్పనిసరని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. -
మానేరు.. కనిపించని నీరు
వేసవికాలం ప్రారంభంలోనే నీరు అడుగంటడంతో కరీంనగర్లోని దిగువ మానేరు డ్యాం ఇలా ఎడారిని తలపిస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. -
భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం
శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులకు తితిదే అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని తితిదే ముద్రించింది. -
యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా
పోలీసు శాఖలో ప్రణీత్రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
రామప్ప ఆలయంలో సోమసూత్రం సమస్యకు పరిష్కారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయంలో సోమసూత్రం (శివలింగ అభిషేక జలం బయటకు వెళ్లే మార్గం) సమస్య పరిష్కారమైంది. -
ఐఎంజీ భూకేటాయింపు వ్యవహారం.. సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ విచారణ వాయిదా
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 850 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది. -
గ్రూపు 1 దరఖాస్తుల సవరణకు నేడు తుది గడువు
టీఎస్పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. -
చెత్త శుద్ధి టెండర్లు ఏమైనట్లు..?
రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రెండేళ్లుగా ఘన వ్యర్థాలు(చెత్త) ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజువారీగా చెత్తను శుద్ధి చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు కొలిక్కి రావడం లేదు. -
9.14 లక్షల ఓట్ల తొలగింపు
రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బిల్లులు ఇవ్వాలి.. అనుమతులు రావాలి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్ బిల్లులు మంజూరు కావాల్సి ఉండటంతోపాటు పలు అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
వాలంటీర్ల ‘సాక్షి’ కొనుగోలుపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సాక్షి దినపత్రిక కొనుగోలు వ్యవహారంపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టనుంది. -
హార్డ్డిస్క్ల విశ్లేషణతో ఆధారాల సేకరణ!
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో వినియోగించిన సాంకేతికతను ఎలా సమకూర్చుకున్నారు..? -
నూతన హైకోర్టుకు నేడు సీజేఐ శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. -
ఏప్రిల్లో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్
వేసవి నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం