చికెన్ వడ్డించలేదని నిలిచిన పెళ్లి
కట్నం చాలలేదనో ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం.. కానీ, చిత్రంగా పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదంటూ ఓ పెళ్లి ఆగిపోయింది.
సీఐ కౌన్సెలింగ్తో 30న జరిపేందుకు నిర్ణయం
షాపూర్నగర్, న్యూస్టుడే: కట్నం చాలలేదనో ప్రేమ వ్యవహారాల కారణంగానో పెళ్లిళ్లు ఆగిపోవడం చూశాం.. కానీ, చిత్రంగా పెళ్లికొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదంటూ ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ షాపూర్నగర్లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. షాపూర్నగర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లివారు బిహార్కు చెందిన మార్వాడీ కుటుంబికులు కావడంతో శాకాహార వంటలు చేశారు. విందు ముగింపు దశలో పెళ్లికుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య గొడవ జరిగి వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లికుమార్తె కుటుంబికులు జీడిమెట్ల సీఐ పవన్ను కలిసి, విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాలవారిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఈనెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబికులు నిర్ణయానికి వచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె