వణికిస్తున్న చలి.. సిర్పూరులో 8 డిగ్రీలు

రాష్ట్రంలో చలి భయపెడుతోంది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు.

Updated : 29 Nov 2022 06:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చలి భయపెడుతోంది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలకన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సోమవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతోందని వాతావరణశాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో పగలు పొడిగా, రాత్రిపూట చలిగా ఉంటుందని ఈ శాఖ వివరించింది. పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని