గూడ్స్ ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
బల్లార్ష నుంచి 30 బోగీలతో కాజీపేటకు బయలుదేరిన గూడ్స్ రైలు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి.
కాసిపేట, తాండూరు- న్యూస్టుడే: బల్లార్ష నుంచి 30 బోగీలతో కాజీపేటకు బయలుదేరిన గూడ్స్ రైలు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రానికి సమీపంలో సోమవారం మధ్యాహ్నం 12.45 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ అలాగే దాదాపు 500 మీటర్ల వరకు ముందుకెళ్లింది. బోగీలు పట్టాలపై ఉన్న విషయాన్ని గమనించిన సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఆ గూడ్సు రైలును రేచిని రైల్వే స్టేషనులో నిలిపి అక్కడి నుంచి ఇంజిన్ను వెనక్కి రప్పించారు. అనంతరం బోగీలను ఇంజినుకు కలిపి కాజీపేటకు పంపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
India News
Goa: ఆస్తి వివాదం.. గోవాలో ఫ్రెంచ్ నటి నిర్బంధం..!
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
India News
SA Bobde: ‘సంస్కృతం ఎందుకు అధికార భాష కాకూడదు..?’ మాజీ సీజేఐ బోబ్డే
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!