ఇంకా ఇసుకలోనే యంత్రాలు!
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ సమీపంలోని మానేరు వరద నష్టం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ సమీపంలోని మానేరు వరద నష్టం తాలూకు ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలతో మానేరు ఉప్పొంగింది. అంతకుముందు ఓడేడ్ నుంచి భూపాలపల్లి జిల్లా గరిమిళ్లపల్లి వరకు నిర్మిస్తున్న వంతెన పనుల కోసం భారీ యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. పనులు చేసే క్రమంలో యంత్రాలు మానేరులోనే ఉన్నాయి. వర్షాలు అధికంగా కురవడంతో వరద ఉద్ధృతికి యంత్రాలు, వంతెనకు సంబంధించిన దిమ్మెలు కొట్టుకుపోయి ఇసుక మేటల్లో కూరుకుపోయాయి. రూ.లక్షల విలువ చేసే భారీ యంత్రాలు ఇంకా ఇసుకలోనే ఉండి శిథిలావస్థకు చేరుతున్నాయి. రూ.47.40 కోట్లతో 2016 ఆగస్టులో ఈ పనులను నాటి రహదారులు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆరేళ్లు దాటినా నిధుల లేమి, వరదల కారణంగా ఈ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు ఈ యంత్రాలను బయటికి తీసేందుకు కూడా యత్నించలేదు.
న్యూస్టుడే, ముత్తారం (కమాన్పూర్)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Chandra Babu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల