సోయా ‘పంట పండింది’
రాష్ట్రంలో సోయాచిక్కుడు సాగుకు తోడ్పాటు అందించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.
ఫలించిన జయశంకర్ వర్సిటీ ప్రయోగం
కొత్త వంగడంతో దిగుబడులు బాగు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సోయాచిక్కుడు సాగుకు తోడ్పాటు అందించేందుకు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా డిమాండ్ పెరిగిన సోయా సాగుకు అధిక దిగుబడినిచ్చే స్థానిక వంగడాల కొరత అధికంగా ఉంది. దీంతో విత్తనాల కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రైవేటు కంపెనీలపై తెలంగాణ రైతులు ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడినిచ్చే వంగడాన్ని వర్సిటీ అభివృద్ధి చేసి.. ఈ వానాకాలంలో రైతులకు ఆ విత్తన సంచులను ఇచ్చి సాగు చేయించింది. ఈమేరకు పండించిన పంట ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చినట్లు వర్సిటీ పరిశోధనల్లో గుర్తించారు. ఇంతవరకు తెలంగాణలో సోయా అత్యధిక సగటు ఉత్పాదకత ఎకరాకు 7.32 క్వింటాళ్లు (2019-20లో) మాత్రమే. ఈ ఏడాది కూడా సగటు 6.67 క్వింటాళ్లుగానే అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. ప్రపంచ సగటు ఉత్పాదకత ఎకరాకు 11.27 క్వింటాళ్లు. ఈ నేపథ్యంలో అభివృద్ధి చేసిన విత్తనాలను ఎంపిక చేసిన కొందరు రైతులకు అందించి సాగు చేయించినట్లు వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ జగదీశ్వర్ ‘ఈనాడు’కు వివరించారు.‘ఆదిలాబాద్ సోయాబీన్ (ఏఎస్బీ)-15’ పేరుతో విత్తన సంచులను రైతులకు ఇచ్చి సాధారణ పద్ధతులతోనే సాగు చేయించారు. ఈ కొత్త విత్తనాలను వర్సిటీ ప్రయోగక్షేత్రాల్లో సాగుచేసినప్పుడు ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రాగా.. రైతుల పొలాల్లో సగటున 10 క్వింటాళ్ల మేర వచ్చింది. ఈ పంట 100 కేజీల గింజలను గానుగాడితే 17.3 కేజీల వంటనూనె రావడం విశేషం. అదే పాత వంగడాలకు సంబంధించి 100 కేజీలకు గాను 11-16 కేజీల మేర మాత్రమే నూనె లభిస్తోంది. పైగా ఈ కొత్త గింజల్లో ‘ప్రోటీన్లు’ రికార్డుస్థాయిలో 44.2% ఉన్నాయి. నూనె తీసిన తర్వాత వచ్చే వ్యర్థాల చెక్కను కోళ్ల, పశు దాణాకు అధికంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం టన్ను సోయావ్యర్థాల చెక్క ధర రూ.50 వేలకు పైగా పలుకుతోంది. అనేక విధాలుగా వినియోగిస్తున్న ఈ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
మన పంటకు మంచి డిమాండ్..
దేశంలో సోయా జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలతో సాగుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. సాధారణ దేశీయ వంగడాలతోనే రైతులు సాగుచేస్తున్నారు. అమెరికా తదితర దేశాల్లో జీఎం విత్తనాలతో సాగుచేస్తున్నందున, మనదేశం నుంచి పంట కొనడానికి ఐరోపా సహా పలు దేశాల వ్యాపారులు పోటీపడుతున్నారు. ఈ ఏడాది సోయాకు క్వింటాలుకు రూ.4,300 చొప్పున మద్దతుధరను కేంద్రం నిర్ణయించింది. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధర బాగున్నందున ప్రైవేటు వ్యాపారులే అంతకన్నా ఎక్కువ చెల్లించి రైతుల నుంచి కొంటున్నారు.
* తెలంగాణలో ఈ ఏడాది 4.30 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగుచేయగా 2.87 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎకరాకు పెట్టుబడి కింద రైతుకు రూ.20 వేల దాకా ఖర్చవుతుండగా.. సగటున రూ.15 వేలకు పైగా లాభం వస్తున్నట్లు వర్సిటీ పరిశీలనలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM