కరెంటు ఛార్జీలు పెరగవు
వచ్చే ఏడాది కరెంటు ఛార్జీలు పెరగవు. ప్రస్తుతమున్న కరెంటు ఛార్జీలను పెంచకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో యథాతథంగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’ (ఈఆర్సీ)ని కోరాయి.
లోటు రూ.10,535 కోట్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీ
అందుకే యథాతథం
ఈఆర్సీకి ఏఆర్ఆర్ నివేదికలిచ్చిన డిస్కంలు
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఏడాది కరెంటు ఛార్జీలు పెరగవు. ప్రస్తుతమున్న కరెంటు ఛార్జీలను పెంచకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో యథాతథంగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’ (ఈఆర్సీ)ని కోరాయి. సంస్థల ఆదాయ, వ్యయాల లెక్కలతో వచ్చే ఏడాదికి ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్ఆర్) నివేదికలను ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల సంచాలకులు గణపతి, స్వామిరెడ్డిలు బుధవారం ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావుకు అందజేశారు. రెండు సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.10,535 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. ఈ లోటు పూడ్చేందుకు నిధులు సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినందున ప్రస్తుతమున్న ఛార్జీలనే వచ్చే ఏడాది యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామని ఈఆర్సీకి తెలిపాయి. ఇందుకు అనుమతి ఇవ్వాలని విన్నవించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఛార్జీల సవరణ నివేదికను తప్పనిసరిగా ఏటా నవంబరు 30కల్లా ఈఆర్సీకి అందజేయాలని విద్యుత్ చట్టంలో నిబంధన ఉంది. సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య ఆర్థికలోటు భారీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయిస్తుందనే భరోసాతో ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనలు ఇవ్వలేదని శ్రీరంగారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఏఆర్ఆర్ ఆధారంగా కరెంటు ఛార్జీలు పెంచడానికి డిస్కంలు ప్రతిపాదనలు ఇవ్వకున్నా, ఎప్పటికప్పుడు పెరిగే ఇంధన ఛార్జీల సర్దుబాటుకు నెలకోసారి గరిష్ఠంగా యూనిట్కు 30 పైసల వరకూ వచ్చే ఏప్రిల్ నుంచే పెంచుకోవడానికి ఇటీవల ముసాయిదా ఉత్తర్వులు జారీచేశామని, వాటిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఏఆర్ఆర్ నివేదికల్లోని ముఖ్యాంశాలను ఆయన వివరించారు.
* రెండు డిస్కంలకు కలిపి వచ్చే ఏడాది మొత్తం వ్యయం రూ.54,058 కోట్లు ఉంటుందని అంచనా. కానీ ఆదాయం రూ.43,523 కోట్లు మాత్రమే వస్తుందని, మిగిలిన లోటును పూడ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి తీరాల్సిందేనని, ఇవ్వకపోతే కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే అంశంపై ఈఆర్సీ ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి వచ్చే మార్చి ఆఖరులోగా తీర్పు చెబుతుందని శ్రీరంగారావు స్పష్టం చేశారు.
* రాష్ట్రంలో వచ్చే ఏడాది ఒక యూనిట్ ‘సరఫరాకు సగటు వ్యయం’ (ఏసీఎస్) రూ.7.34 అవుతుందని డిస్కంలు తెలిపాయి. ప్రస్తుత ఏడాది (2022-23)లో అది రూ.7.03 మాత్రమేనని ఈఆర్సీ గతంలో ఆదేశాలిచ్చిందని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఏడాదికి యూనిట్కు ఏసీఎస్ ఏకంగా 31 పైసలు పెరగనుందని డిస్కంలు అందజేసిన నివేదికలను ప్రజల ముందు ఉంచి బహిరంగ విచారణ చేసి వాస్తవ ఏసీఎస్ ఎంత ఉంటుందని ఈఆర్సీ నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
* వచ్చే ఏడాది మొత్తం 83,113 మిలియన్ యూనిట్ల (మి.యూ) కరెంటు కొనాల్సి ఉంటుందని, ఇందులో రాష్ట్ర అవసరాలకు 73,618 మి.యూ.ల సరఫరా చేయాల్సి ఉంటుందని డిస్కంల అంచనా. సరఫరా చేయగా మిగిలేది పంపిణీ, సరఫరా వ్యవస్థలో నష్టపోనున్నట్లు డిస్కంలు తెలిపాయి.
* వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ వద్ద తప్పనిసరిగా మీటర్ల ఏర్పాటుకు 2024 డిసెంబరు వరకు గడువు నిర్ణయించారు.
* నెలకు 500 యూనిట్లకు పైగా కరెంటు వాడుకుంటున్న వినియోగదారుల కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్మీటర్లు పెట్టాలి.
* వచ్చే ఏడాది మొత్తం కరెంటు వినియోగంలో పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు వాడేది వరసగా 13.75 శాతం, 15.07 శాతం ఉండవచ్చు.
* రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక కరెంటు వినియోగం 2021-22లో 2126 యూనిట్లుగా రికార్డు నమోదైంది. జాతీయ తలసరి సగటు వినియోగం 1255 యూనిట్లు.
* రాష్ట్రంలో ఒకరోజు అత్యధిక కరెంటు డిమాండు 2022 మార్చి 29న 14,160 మెగావాట్లుగా రికార్డు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు