బీఎల్ సంతోష్ ఇంట్లోనే సమావేశం
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్ సంతోష్కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది.
‘ఎమ్మెల్యేలకు ఎర’ కుట్రలో ఇదే కీలక భేటీ
అక్టోబరు 15న దిల్లీలో ప్రభుత్వ క్వార్టర్లో చర్చలు
నిందితుల ఫోన్ లొకేషన్లు అక్కడే ఉన్నట్లు గుర్తింపు
హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. కుట్రలో భాజపా కీలక నేత బీఎల్ సంతోష్కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది. దిల్లీలో ఆయన ఇంట్లోనే కుట్రకు సంబంధించి కీలక సమావేశం జరిగినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. అలాగే నిందితులంతా కుట్ర గురించి చర్చించుకున్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్నీ సిట్ సేకరించింది. ఇప్పటివరకు ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీఎల్ సంతోష్కు మధ్య జరిగిన వాట్సప్ సంభాషణల కీలక సమాచారం బహిర్గతమైంది. నిందితుల మధ్య జరిగిన ఇన్స్టాగ్రామ్ చాటింగ్లూ బయటపడ్డాయి. తెలంగాణలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పేర్లతోపాటు ప్రస్తుత రాజకీయ స్థితిగతుల గురించి పెద్దఎత్తున చాటింగ్ జరిగినట్లు సిట్ నివేదికలో వెల్లడైంది.
హరిద్వార్.. దిల్లీ.. నాగ్పుర్లలో సమావేశాలు
* రామచంద్రభారతికి బీఎల్ సంతోష్తో చాలాకాలంగా పరిచయముంది. వారిద్దరి మధ్య గతేడాది ఆగస్టులో పలు వాట్సప్ చాటింగ్లు జరిగాయి.
* హరిద్వార్లో ఈ ఏడాది ఏప్రిల్ 11న రామచంద్ర భారతి, సంతోష్ల సమావేశం జరిగింది. ఆ సమయంలో వారిద్దరి ఫోన్ల లొకేషన్లు అక్కడే ఉన్నాయి. సిట్ విచారణ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధి ముంజగళ్ల విజయ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.
* తెలంగాణలో ఆపరేషన్ గురించి ఏప్రిల్ 26న సంతోష్కు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పంపారు.
* ఆగస్టు 21న కుట్రకు సంబంధించి దిల్లీలోని కల్కాజిలో సమావేశం జరిగింది. వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ కేసీ పాండే ఇంట్లో అతడితోపాటు రామచంద్రభారతి, సింహయాజి, న్యాయవాది ప్రతాప్ హాజరై చర్చించారు.
* దిల్లీ వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్లో సెప్టెంబరు 4న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్ ఈ కుట్రకు సంబంధించి సమావేశం నిర్వహించారు. వీరందరి ఫోన్ లొకేషన్లు అక్కడే చూపించాయి.
* నందకుమార్, సింహయాజి, శ్రీనివాస్ నాగ్పుర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. భారతీయ రక్షా మంచ్ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడే పలువురు నేతల్ని కలిశారు.
* కుట్రకు సంబంధించి కీలక సమావేశం సెప్టెంబరు 26న నందకుమార్ ఇంట్లో జరిగింది. ఆయనతోపాటు రామచంద్ర భారతి, సింహయాజి, శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిని అక్కడికి పిలిచి మాట్లాడారు. విజయ్ వాంగ్మూలం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.
* కుట్రకు సంబంధించి సెప్టెంబరు 26 నుంచి ఆగస్టు 14 వరకు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, జగ్గుస్వామి, బీఎల్ సంతోష్, తుషార్, ప్రతాప్, విజయ్ల మధ్య తరచూ వాట్సప్ చాటింగ్లు జరిగాయి. ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు.
* కుట్రలో అత్యంత కీలకమైన సమావేశం అక్టోబరు 15న దిల్లీలో బీఎల్ సంతోష్ ఇంట్లో (ప్రభుత్వ క్వార్టర్) జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో సంతోష్తోపాటు తుషార్, రామచంద్ర భారతి, నందకుమార్, విజయ్ పాల్గొన్నారు. సిట్ విచారణలో విజయ్ ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. అతడి ఫోన్లోనూ అక్కడి వీడియో లభ్యమైంది. నిందితుల ప్రయాణ వివరాలను.. దిల్లీలో మకాం ఉన్న ప్రాంతాల వివరాలనూ సిట్ సేకరించింది. న్యాయవాది ప్రతాప్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
* కుట్ర గురించి రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి, జగ్గుస్వామి, శ్రీనివాస్, ప్రతాప్, విజయ్ల మధ్య సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 26 వరకు వాట్సప్ చాటింగ్లు జరిగాయి.
కోదండరాం.. రాజనర్సింహాలనూ సంప్రదించారు
సింహయాజి కొందరు రాజకీయ పార్టీల నేతలతో హైదరాబాద్లోని స్కైహై హోటల్లో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతమున్న పార్టీల్లో నుంచి భాజపాలోకి మారడం కోసమంటూ ఈ భేటీ ఏర్పాటుచేశారు. ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహా తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సిట్ విచారణలో న్యాయవాది ప్రతాప్, విజయ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. సింహయాజితోపాటు సదరు రాజకీయ నేతల సెల్ఫోన్ లొకేషన్లు ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్నాయి.
సంతోష్, రామచంద్ర భారతి వాట్సప్ చాటింగ్..
రామచంద్ర భారతి: ‘నిన్న రాత్రి పది గంటలవరకు మీ స్పందన కోసం వేచి చూశాను. ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేయాలి. అలాగే చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఒకసారి చూడాలని ఉంది..’
సంతోష్: సారీ.. తీరికలేకుండా ఉన్నందున సమయం ఇవ్వలేకపోయాను. నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నాను. 1.నమ్మదగ్గ వ్యక్తి ఏకే సింగ్.. 2.ఆర్ వశిష్ఠ్. మొదటి వ్యక్తి ఓకే. రెండో వ్యక్తి గురించి సీనియర్ డీహెచ్తో చర్చించాల్సి ఉంది.
రామచంద్ర భారతి : అలాగే నేను ఇంతకుముందు చెప్పిన విషయంలో మీకు సౌకర్యంగా ఉంటే ముందుకెళ్దాం. లేదంటే వదిలేద్దాం. కానీ, ఏకే సింగ్ మన వ్యక్తి. దయచేసి అతడి గురించి సందీప్కు చెప్పండి.
సంతోష్: సరే. వశిష్ఠ్ గురించి అప్డేట్ చేస్తాను. సతీష్ను సంప్రదించాల్సి ఉంది. ఏకే గురించి సందీప్కు చెప్పే ప్రయత్నం చేస్తా. నా కాల్ తర్వాత ఆయనను కాంటాక్ట్ చేయండి. థాంక్స్..
వాయిస్లను నిర్ధారించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక
అక్టోబరు 26న ఫామ్హౌస్లో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ అనంతరం రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ల వాయిస్ రికార్డులను సేకరించారు. ఎఫ్ఎస్ఎల్(ఫొరెన్సిక్ ల్యాబ్)లో ఆటోమేటిక్ స్పీకర్ ఐడెంటిఫికేషన్ ఎగ్జామినేషన్ ద్వారా వాటిని విశ్లేషించిన అనంతరం అవి నిందితుల వాయిస్లే అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని తేలింది.
జగ్గుస్వామి, మరో కీలక నిందితుడు మధ్య వాట్సప్ చాటింగ్ సారాంశం..
తెరాస, కాంగ్రెస్ కలిస్తే భాజపాకు ముప్పు
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల గురించి కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. తెరాసను, కాంగ్రెస్లో కలిపే విషయంలో దిగ్విజయ్సింగ్, కేసీఆర్ మధ్యలో సమావేశం జరిగింది. సోనియాను ఒప్పించడం కోసం చర్చించారు. ఇది భాజపాకు అత్యంత ప్రమాదకర పరిణామం. నా బృందంలోని సభ్యుడు మూడేళ్లుగా తెలంగాణలో పనిచేస్తున్నాడు. అతడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న రాజనర్సింహాకు అత్యంత సన్నిహితుడు. దళిత, రెడ్డి సామాజికవర్గాల్లో రాజనర్సింహకు బలమైన మద్దతుంది. 20 నియోజకవర్గాల్లో 75 వేల చొప్పున ఓటు బ్యాంకుంది. ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అతడి వద్ద సమాచారముంది. మరోవైపు కేసీఆర్ బృందంలోని వ్యక్తి అమిత్జీని సంప్రదించారు. అతడు భాజపాలోకి వస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. మీరు సాధ్యమైనంత తొందరగా సమయం కేటాయించండి.
ఏపీలో చాలా మంది ఎమ్మెల్యేలు జగన్పై వ్యతిరేకతతో ఉన్నారు..
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్రెడ్డి అవినీతికి, కన్వర్షన్స్కు వ్యతిరేకంగా మన బృందమే పనిచేస్తోంది. వైకాపాపై సొంతపార్టీ నేతల్లోనే నిర్లిప్తత కనిపిస్తోంది. కుటుంబ సంబంధ వ్యవహారాల కారణంగా సొంత ఎమ్మెల్యేలే చాలా మంది జగన్పై వ్యతిరేకతతో ఉన్నారు. జగన్ కంటే షర్మిలకే మంచి పేరుంది. వైకాపా నుంచి 55 మంది ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీలకు చెందిన 20 మంది నేతలు భాజపాలో చేరేందుకు ఉత్సుకతతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి అంతే మెజారిటీతో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. దీన్ని సాధ్యమైనంత తొందరగా సాకారం చేయగలిగితే తెలంగాణాలోనూ మనకు లబ్ధి కలిగిస్తుంది. ఆలస్యం చేయకుండా దీని గురించి చర్చిస్తే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
-
రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ