నేడు మునుగోడుకు అయిదుగురు మంత్రులు

ఇటీవల ఉప ఎన్నిక జరిగిన మునుగోడు నియోజకవర్గంలో గురువారం అయిదుగురు మంత్రులు పర్యటించనున్నారు.

Published : 01 Dec 2022 04:47 IST

ఈనాడు,హైదరాబాద్‌: ఇటీవల ఉప ఎన్నిక జరిగిన మునుగోడు నియోజకవర్గంలో గురువారం అయిదుగురు మంత్రులు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రశాంత్‌రెడ్డిలు మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచిన సందర్భంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు మునుగోడు అభివృద్ధికి, ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కేసీఆర్‌ బుధవారం కేటీఆర్‌, ఇతర మంత్రులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు