‘అంగన్వాడీ’ భర్తీలో గందరగోళం!
రాష్ట్రంలో చేపట్టిన అంగన్వాడీ సూపర్వైజర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సూపర్వైజర్ల నియామకాలపై విమర్శలు
నిబంధనలు పాటించలేదని అభ్యర్థుల ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన అంగన్వాడీ సూపర్వైజర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక జాబితాలో చోటు సంపాదించి ఎక్కువ మార్కులు పొందినా.. తుది జాబితాలో ఎంపికవకపోవడం పట్ల పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రకటనలో అంగన్వాడీ ఇన్స్ట్రక్టర్లకు 5 శాతం రిజర్వేషనును కేటాయించినా.. ఆ మేరకు వారికి పోస్టులు రిజర్వు చేయలేదని, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి.
మహిళా శిశు సంక్షేమ శాఖలోని 433 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరులో ప్రకటన వెలువడింది. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అంగన్వాడీ టీచర్లు, సహాయకుల్లో అర్హత కలిగిన వారికి పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తుంది. అంగన్వాడీ శిక్షణ కేంద్రాల ఇన్స్ట్రక్టర్లకు కూడా అవకాశమివ్వాలని నిర్ణయించిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి 5 శాతం పోస్టులను ప్రత్యేకంగా కేటాయించింది. అర్హులైన ఇన్స్ట్రక్టర్లు లేకుంటే వాటిని అంగన్వాడీ టీచర్లు, సహాయకులతో భర్తీ చేస్తామని వెల్లడించింది. అయితే నియామకాల విషయానికి వచ్చేసరికి దాన్ని పాటించలేదు అని అభ్యర్థులు పేర్కొంటున్నారు. సూపర్వైజర్ల నియామకాలకు గత జనవరిలో నిర్వహించిన రాతపరీక్షకు 16,815 మంది హాజరవగా.. మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. న్యాయవివాదాల కారణంగా తుదిఎంపికలో జాప్యం చోటుచేసుకుంది. ఆ వివాదాలు పరిష్కారమవడంతో ఇటీవలనే నియామకాల ప్రక్రియ ముగిసింది. అయితే, తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు వచ్చాయని, దివ్యాంగుల ఎంపికలో సమన్యాయం జరగలేదని కొందరు శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్యోగ ప్రకటనలో స్పష్టత ఏదీ...?
కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా పోస్టులను రిజర్వు చేసినపుడు భర్తీ విధానాన్ని ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనాలి. ఆయా పోస్టులను కేటగిరీ వారీగా రిజర్వు చేయాలి. నిబంధనల ప్రకారం ఉద్యోగ ప్రకటనలో ప్రత్యేక రిజర్వేషన్లు అంటూ ఉండవు. రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో ఆ పోస్టులను రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు నష్టం జరగకుండా వాటిని ఓపెన్ జనరల్ కింద పేర్కొనాలి. అయితే అధికారులు ఈ నిబంధనలు పాటించలేదని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పోలీసు నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ల అభ్యర్థుల ఎంపిక వివరాలను ఆ ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా వెయిటేజీ మార్కులు ఇస్తూ భర్తీ చేస్తున్నారు. శిశు సంక్షేమ శాఖలో మాత్రం ఈ నిబంధనలు పాటించలేదని, దీంతో అవకాశాలు కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల కేటగిరీలోనూ తమకు అన్యాయం జరిగిందని అధికారులకు కొందరు వినతిపత్రాలను అందించారు.
నిబంధనలకు లోబడే..
అంగన్వాడీ సూపర్వైజర్ల నియామకాల విషయమై వచ్చిన ఆరోపణపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ‘ఈనాడు’ సంప్రదించగా... నిబంధనల ప్రకారమే పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. ప్రాథమిక ఎంపిక జాబితాలోని అభ్యర్థుల విద్యార్హత పత్రాలు పరిశీలించి అనర్హులను తొలగించామని, వీరి స్థానంలో స్థానిక అభ్యర్థులకు న్యాయం చేశామన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలు, వైద్య మండలి ధ్రువీకరించిన దివ్యాంగుల పర్సంటైల్ను పరిగణనలోకి తీసుకుని తుది నియామకాలు చేపట్టామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ