నియామకాలకు ఓ విధానం లేదా?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలకు ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఖాళీలున్నాయని వారికి ఎలా తెలిసింది? ఎలా దరఖాస్తు చేసుకున్నారు?
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి రిజర్వేషన్లు ఉన్నాయా?
టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు వ్యాఖ్యలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకాలకు ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఖాళీలున్నాయని వారికి ఎలా తెలిసింది? టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి తెలుసుకున్నారా, లేదంటే సమీపంలోని పాన్ డబ్బాల్లో ఖాళీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారా అంటూ వ్యాఖ్యానించింది. నిబంధనలకు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం జరిగిందంటూ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ వినాయక్రెడ్డి గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సి.వి.భాస్కర్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియామకాలే చట్ట ప్రకారం లేవు. నియమితులైన వారిలో రమావత్ ధన్సింగ్ జీహెచ్ఎంసీలో ఈఎన్సీగా రిటైరయ్యారు. సుమిత్ర ఆనంద్ జెడ్పీ స్కూల్లో తెలుగు టీచరు. ఎ.చంద్రశేఖర్రావు ఆయుర్వేదిక్ డాక్టరు. రవీందర్రెడ్డి రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్. ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలందించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ క్లాస్ గెజిటెడ్ పోస్టుల్లో పని చేసిన వారే అర్హులు’’ అని వివరించారు.
ఇక్కడ ఏదైనా కమిటీ ఉందా?
రాజ్యాంగ పోస్టుల వంటి ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టినపుడు అంతే స్థాయిలో కసరత్తు జరగాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నల్సార్ వైస్ఛాన్సలర్ నియామకానికి ఓ కమిటీ ఉందని, అలాగే ఇక్కడ ఏదైనా కమిటీ ఉండి దరఖాస్తులను ఆహ్వానించి పరిశీలించి సిఫార్సు చేసిందా అని ప్రశ్నించింది. ‘‘దరఖాస్తుల ఆహ్వానం ఎలా జరిగింది? దరఖాస్తు ఎలా చేసుకున్నారు? ఎంపిక విధానం ఏమిటి? తెలంగాణ వంటి కొత్త రాష్ట్రంలో అర్హులైనవారు, ఆశావహులు చాలా మంది ఉంటారు. వారికి పారదర్శకంగా అవకాశం కల్పించాల్సి ఉంది. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం ఉంది. సీనియర్ న్యాయవాదుల గుర్తింపునకు నోటీసు జారీ, దరఖాస్తు చేసుకున్నవారితో కమిటీ మాట్లాడటం వంటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడా పారదర్శకమైన ఓ విధానం ఉండాలి కదా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.
చట్టబద్ధంగానే నియామకాలు: ఏజీ బి.ఎస్.ప్రసాద్
జీవో 54 ప్రకారం నియామకాలు జరిగాయని, నిబంధనల్లో అచ్చు తప్పు దొర్లిందని.. అది తప్ప నియామకాలు చట్టబద్ధంగానే జరిగాయని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ తెలియజేశారు. ‘‘కమిషన్లో ఖాళీలున్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. మంత్రి మండలిలో చర్చించి అర్హులైనవారినే నియమించింది’’ అని తెలిపారు. ప్రతివాదులైన సభ్యుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సభ్యులుగా నియమితులైనవారు తెలంగాణ ఉద్యమంతో సహా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అస్సాం ఉద్యమంలో పాల్గొని నష్టపోయినవారికి ప్రపుల్లకుమార్ మహంత ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని, తెలంగాణలో కూడా ఇలాంటి రిజర్వేషన్లు ఏవైనా ఉన్నాయా అని అడిగింది. ఏజీ స్పందిస్తూ అలాంటివి లేవని, స్థానిక రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. మంత్రి మండలిలో చర్చించాక అర్హులైనవారినే నియమించినట్లు చెప్పారు. వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్