ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌గా బాలకృష్ణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌గా ఎస్‌.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జీటీ జీవన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 02 Dec 2022 04:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్‌గా ఎస్‌.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జీటీ జీవన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో తొమ్మిది మందితో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. గురువారం హైదరాబాద్‌లోని సమాఖ్య ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గోపీకృష్ణ, సహ ఛైర్మన్లుగా గవ్వా రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా జగన్మోహన్‌, కోశాధికారిగా వి.రవికుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా రవికుమార్‌, సలహాదారుగా ఇంద్రకుమార్‌, సంయుక్త కార్యదర్శులుగా మల్లికార్జున్‌, భవన రుషిలను ఎన్నుకున్నారు. కొత్త కార్యవర్గం రెండేళ్లపాటు కొనసాగుతుందని జీటీ జీవన్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కృషిచేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని