గిరిజనులకు న్యాయం చేయండి
తెలంగాణలో పోడు భూముల అంశంలో గిరిజనులకు న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ కోరారు.
రాష్ట్రపతికి రామచంద్రుడు తేజావత్ వినతి
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పోడు భూముల అంశంలో గిరిజనులకు న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముందుగా రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు ద్రౌపది ముర్ముకు రామచంద్రుడు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. చట్టసభలతో పాటు ఉన్నత న్యాయవ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేలా చొరవ చూపాలని, గవర్నర్ల నియామకంలోనూ రిజర్వేషన్లు అమలుచేయాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ విభాగాలకు చెందిన సివిల్ సర్వీసు అధికారులను వారి సొంత రాష్ట్రాలకు కేటాయించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
Politics News
Nitish: భాజపాతో మళ్లీ జట్టు కట్టడం కంటే చనిపోవడమే మేలు : నీతీశ్