కవితకు సీబీఐ నోటీసులు
దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. దిల్లీలో నమోదుచేసిన ఆర్సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు.
దిల్లీ మద్యం కేసులో 6న ఉదయం 11 గంటలకు విచారణ
దిల్లీ, హైదరాబాద్ నివాసాల్లో ఎక్కడ సౌకర్యమో చెప్పాలని సూచన
హైదరాబాద్ ఇంటికే రావాలని కోరా: కవిత
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసింది. దిల్లీలో నమోదుచేసిన ఆర్సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ‘‘ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోకానీ, దిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతోపాటు మరో 14 మందిపై కేసు నమోదైనట్లు ఇందులో తెలిపారు. 2021-22 దిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానంపై వచ్చిన ఆరోపణల్లో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ‘‘విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. దర్యాప్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ అంశాలపై మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడింది’’ అని కవితకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో ఈడీ అరెస్ట్ చేసిన అమిత్ అరోడాను బుధవారం కోర్టులో హాజరుపరిచినప్పుడు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు తొలిసారిగా కనిపించింది. ఆప్ నేతలకోసం సౌత్గ్రూప్ విజయ్నాయర్కు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిందని, ఆ గ్రూప్ కవిత, శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి నియంత్రణలో ఉందని ఈడీ అందులో పేర్కొంది. అలాగే దిల్లీ మద్యం విధాన ఖరారు సమయం నుంచి ఈ వివాదం వెలుగులోకి వచ్చిన గత ఆగస్టు నాటికి దాదాపు ఏడాది కాలంలో కవిత రెండు ఫోన్ నంబర్లకు చెందిన పది ఫోన్లు మార్చడమో, ధ్వంసమో చేసినట్లు కూడా పేర్కొంది. అందులో 5 ఫోన్లు ఈ ఏడాది ఆగస్టు 9, 22, 23 (రెండు ఫోన్లు), 24 తేదీల్లో మార్చినట్లు తెలిపింది. ఆ విషయం వెలుగులోకి వచ్చిన రెండో రోజే సీబీఐ విచారణ కోసం సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసింది.
నా వివరణ కోసం నోటీసులిచ్చింది
ఈనాడు, హైదరాబాద్: సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత ధ్రువీకరించారు. ‘‘నా వివరణ కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్లోని మా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశా. ఇంటివద్దే వారికి వివరణ ఇస్తా’’ అని కవిత శుక్రవారం రాత్రి విలేకరులకు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత