దూదిపూల దుఃఖం.. ఇంతింత కాదయా!
పత్తి రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా దిగుబడి నిరాశాజనకంగా ఉండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
పత్తి దిగుబడి లేక పెట్టుబడీ రాదాయె
మార్కెట్కు అరకొర పంట.. పెచ్చుపెరిగిన ధర
వర్షాలు, తెగుళ్లు దెబ్బతీశాయని రైతుల ఆవేదన
ఈనాడు, హైదరాబాద్: పత్తి రైతుల వేదన వర్ణనాతీతంగా ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా దిగుబడి నిరాశాజనకంగా ఉండటంతో రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. గతానికి భిన్నంగా ఈ సీజన్లో పత్తి పంటను ప్రైవేటు వ్యాపారులే మద్దతు ధరకు మించి కొంటున్నా కర్షకులకు ఆశనిపాతం తప్పలేదు. క్వింటా మద్దతు ధర రూ.6,380 కాగా వ్యాపారులు రూ.8వేలకు పైగా చెల్లించడానికి ముందుకొస్తున్నారు. గతంలో మద్దతు ధర కోసం రైతులు ఆందోళనకు దిగితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ‘భారత పత్తి సంస్థ’(సీసీఐ)తో పంట కొనిపించేది. ఈ ఏడాది అసలు అలాంటి పరిస్థితే లేదు. వ్యాపారులు ఎగబడి కొనడానికి కారణం రైతుల వద్ద పంట పెద్దగా లేకపోవడమేనని మార్కెటింగ్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు వివరించారు. అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దెబ్బతినడంతో మార్కెట్లకు పత్తి పెద్దగా రావడం లేదు. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో పంట సాగవగా ఇందులో ఉత్తర తెలంగాణలోని 19 జిల్లాల పరిధిలోనే 31.12 లక్షల ఎకరాలుంది. ఈ జిల్లాల మార్కెట్లకు ఇప్పటివరకూ 8.91 లక్షల క్వింటాళ్ల పత్తినే అమ్మకానికి తెచ్చారు. అంటే కనీసం ఎకరానికి క్వింటా పత్తి కూడా మార్కెట్లకు రాలేదని విశ్లేషణలో తేలింది. గతేడాది ఇదే సమయానికి ఇవే జిల్లాల్లో 18.86 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు వచ్చిందంటే ఈ ఏడాది దిగుబడి ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
మూతపడుతున్న జిన్నింగు మిల్లులు..
రాష్ట్రంలో 350 జిన్నింగు మిల్లులున్నా సరిగా పత్తి రాక.. 150 వరకూ మూతపడ్డాయి. మిగిలిన 200 మిల్లులూ కూడా తగినంతగా పంట రాక కేవలం 10శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ ‘ఈనాడు’కు చెప్పారు. పంట సరిగా రాక రైతులు, మిల్లులు సవ్యంగా నడపలేక తాము అప్పులు, నష్టాల్లో కూరుకుపోయినట్లు ఆయన వాపోయారు. పత్తి పంటకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ధర బాగున్నా.. ఇంకా పెరుగుతుందేమోనన్న ఆశతో కొందరు రైతులు పంటను ఇళ్లలోనే దాచుకుంటున్నారని, దీనివల్ల కూడా మార్కెట్లు వెలవెలబోతున్నాయని ఆయన వివరించారు. ఇంకా పత్తిచేలలో దూది తీయాల్సి ఉందని, రానున్న రెండునెలలు కీలకమన్నారు. అరకోటి ఎకరాల్లో పత్తిపంట సాగయినా ఈ ఏడాది 30 లక్షల టన్నులకు మించి దిగుబడికి అవకాశం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎకరానికి 3 క్వింటాళ్లే దిగుబడి..
మాకున్న ఆరెకరాల పొలంలో ఈ ఏడాది పత్తి వేశా. ఎకరానికి రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో ఎకరానికి మూడు క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. గతేడాది ఎకరానికి పది క్వింటాళ్ల చొప్పున రాగా ఈసారి అందులో సగమైనా రాలేదు. క్వింటాలుకు రూ.8200 ధర పలికినా పెట్టుబడి అయినా తిరిగి రాలేదు.
- కాడే నారాయణ, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా
పెట్టుబడీ దక్కే అవకాశం లేదు
ఈ ఏడాది అప్పులు తెచ్చి ఐదెకరాల్లో పత్తి వేశా. ఇందులో రెండెకరాలు సొంతభూమి, మిగిలింది కౌలుకు తీసుకున్నా. ఎకరానికి రూ.10వేల చొప్పున కౌలుకే రూ.30వేలు కట్టా. ఎకరానికి రూ.40వేల వరకూ పెట్టుబడి పెట్టా. వర్షాలతో ఎకరానికి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పెట్టుబడీ దక్కేటట్లు లేదు. పత్తికి ఇప్పుడు మార్కెట్లో ధర బాగున్నా.. నాలాంటి నష్టపోయిన రైతులకు ఒరిగిందేమీ లేదు.
- పోడేటి పరశురాంగౌడ్, వెదిర, కరీంనగర్ జిల్లా
ధర బాగున్నా.. చేతిలో పంట లేదు
నేను నాలుగెకరాల్లో పత్తి వేశా. రూ.లక్షకు పైగా అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టా. గతంలో ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ సీజన్లో 5 క్వింటాళ్ల దిగుబడే రావటంతో తీవ్రంగా నష్టపోయా. మాకు గతంలో మంచి దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్లో సరైన ధర లేదు. ఇప్పుడు ధర బాగున్నా పంట రాక నష్టపోయా.
- జి.గంగుమల్లు, ఇబ్రహీంపూర్, మెదక్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో