Telangana News: అడవిలో అభిమన్యులు.. దాడులు జరిగితే అంతే!
ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి.
బీట్ ఆఫీసర్ పోస్టుల్లో 38 శాతం ఖాళీలు
ఒక్కో ఎఫ్బీఓకు రెండు మూడు బీట్ల బాధ్యతలు
ఆక్రమణదారులు, స్మగ్లర్లు, అగ్ని ప్రమాదాల రూపంలో ముప్పు
ఈనాడు, హైదరాబాద్: ఒకవైపు అటవీ భూముల్ని ఆక్రమణల నుంచి కాపాడాలి. మరోవైపు అటవీ సంపదను కాపాడే క్రమంలో స్మగ్లర్ల దాడుల్ని ఎదుర్కోవాలి. వేటగాళ్ల నుంచి వన్యప్రాణుల్ని సంరక్షించాలి. రేయింబవళ్లు విధులు, అణుక్షణం అప్రమత్తం. అడవిలో అడుగుపెట్టాక ఎప్పుడు ఆపద ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. వాస్తవంగా అడవుల్లో క్షేత్రస్థాయిలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొనేది బీట్ అధికారులే. ఇలాంటి కీలక విభాగంలో ఏకంగా 38 శాతం పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు దారుణ హత్య ఉదంతానికి ఇలాంటి పరిస్థితులే కారణమని ఆ శాఖ సిబ్బంది ఉదహరిస్తున్నారు.
ఒంటరి పోరాటం
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. అందులో అటవీ విస్తీర్ణం 26,903.70 చ.కి.మీ. అడవులను రక్షించేందుకు ఉన్న బీట్ అధికారుల పోస్టుల సంఖ్య కేవలం 3,647. ఇందులో 1,393 ఖాళీలు ఉన్నాయి. ఉన్న వాళ్లలో దాదాపు 15 శాతం మంది ఉన్నత ఉద్యోగాల శిక్షణ కోసం సెలవులో ఉన్నారు. ఈ విభాగంలో దాదాపు 42 శాతం మహిళా ఉద్యోగులే. దీంతో అరకొర సిబ్బందిపైనే అడవుల్ని కాపాడే భారం పడుతోంది. ఒక్కో అటవీ బీట్ విస్తీర్ణం 600-700 హెక్టార్లు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో బీట్ అధికారి రెండు, మూడు బీట్ల బాధ్యతలు చూడాల్సివస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆక్రమణదారులు, స్మగ్లర్లు, వేటగాళ్లతో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందని’ బీట్ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు అడవుల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే సమయంలో దాడులు ఎదుర్కొంటున్నామని, సెక్షన్కు ఒకటి మాత్రమే మంటలను ఆర్పే బ్లోయర్లు ఉన్నాయని, వేసవిలో అడవి అంటుకుంటే అనేక చోట్ల చీపుర్లతోనే మంటలు ఆర్పాల్సి వస్తోందని’ కన్నీటిపర్యంతమవుతున్నారు.
దాడులు జరిగితే అంతే
ఎఫ్బీఓలు, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ఆర్వోలకు ఆయుధాల్లేవు. చేతిలో కర్రలే వారి ఆత్మరక్షణకు ఆయుధాలు. ఇది కూడా స్మగ్లర్ల ఆగడాలకు కారణమవుతోందనే విమర్శలున్నాయి. ‘ఎఫ్ఆర్వో స్థాయి అధికారులకు వాహనాలిచ్చినా అవి కాలం చెల్లినవి. సాధారణ జీపులు కావడంతో ఎవరైనా దాడి చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. గతంలో ఓ అటవీ అధికారిని జీపులో ఉండగానే చంపేశారు. పోలీసులకు మాదిరి అన్ని వైపులా డోర్లు, ఇనుపజాలీ వంటి రక్షణ ఏర్పాట్లతో కూడిన వాహనాలుండాలి. అటవీ ఉద్యోగులకు గతంలోమాదిరి ఆయుధాలు ఇచ్చేందుకు నిర్ణయం వచ్చేలోగా ప్రతి అటవీ రేంజ్కు నలుగురు, ఐదుగురు పోలీసులను ఇవ్వాలి’ అని ఎఫ్ఆర్వోలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!