ఆదర్శ పాఠశాల.. అవస్థల వంటశాల

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ధర్యాపూర్‌ ఆదర్శ పాఠశాల వంట గది ఇది. ఇక్కడ 6 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న దాదాపు 500 మంది డే స్కాలర్‌ విద్యార్థులకు ఈ చిన్న పాకలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు.

Updated : 03 Dec 2022 05:46 IST

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ధర్యాపూర్‌ ఆదర్శ పాఠశాల వంట గది ఇది. ఇక్కడ 6 నుంచి 10 తరగతుల వరకు చదువుతున్న దాదాపు 500 మంది డే స్కాలర్‌ విద్యార్థులకు ఈ చిన్న పాకలోనే మధ్యాహ్న భోజనం వండుతున్నారు. వేసవిలో, వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అప్పుడప్పుడు పాములు కూడా వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. వంటశాల కోసం ప్రత్యేక గది నిర్మాణానికి ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపినట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

- న్యూస్‌టుడే, కమాన్‌పూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని