ఫిబ్రవరి 21 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి.

Updated : 04 Dec 2022 05:37 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు మార్చి 3న ముగుస్తాయని శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రచురించిన 2023 సంవత్సర క్యాలెండర్‌లో పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే తిరు కల్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు శనివారం నుంచి టికెట్ల విక్రయాలు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. టికెట్‌ ధర రూ.3 వేలు. ఆన్‌లైన్‌లో https://yadadritemple.telangana.gov.in  వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని