మూడోసారి ఆ మూడు గనులకు టెండర్లు
తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి.
గతంలో రెండుసార్లు ఆసక్తి చూపని గుత్తేదారులు..
తనకు కేటాయించాలని సింగరేణి కోరుతున్నా స్పందించని కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని మూడు కొత్త బొగ్గు గనులను సింగరేణికి పాతపద్ధతిలో అప్పగించడానికి కేంద్రం ససేమిరా అంటోంది. తాజాగా దేశవ్యాప్తంగా వేలానికి పెట్టిన 133 బొగ్గు గనుల్లో, రాష్ట్రంలోని ఆ మూడింటితోపాటు.. సింగరేణి వద్దని వదిలేసిన మరో గని ఉన్నాయి. ఈ 4 గనుల్లో 30.87 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26లోగా టెండర్లు దాఖలు చేసి వేలంలో దక్కించుకోవచ్చని కేంద్ర బొగ్గు శాఖ జారీచేసిన తాజా టెండరు నోటిఫికేషన్లో ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణలోని పెనగడప, శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్-3, కల్యాణఖని బ్లాక్-6 ఉన్నాయి. పెనగడప గనిలో నాణ్యత అంతగా లేని జీ13 గ్రేడ్ బొగ్గు వస్తుందని, సింగరేణి సంస్థనే దీనిని వేలానికి అప్పగించినట్లు కేంద్ర బొగ్గు శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక మిగిలిన 3 గనులను వేలంలో పెట్టకుండా నేరుగా తమకే అప్పగించాలని సింగరేణి సంస్థ కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ గనులు సింగరేణికి ఇప్పటికే ఉన్న పాత గనులను ఆనుకుని ఉన్నాయి.
బొగ్గు గనుల వేలం విధానం అమల్లోకి వచ్చాక.. ఇది ఆరో నోటిఫికేషన్. శ్రావణపల్లి, సత్తుపల్లి బ్లాక్-3, కల్యాణఖని బ్లాక్-6, కోయగూడెం గనులు గత రెండు టెండర్ నోటిఫికేషన్లలోనూ ఉన్నాయి. అప్పట్లో కోయగూడెం గనికి మాత్రమే తెలంగాణకు చెందిన ‘ఆరో కోల్’ కంపెనీ టెండరు వేసి దక్కించుకుంది. మిగిలిన మూడు గనులకు ఒక్క టెండరూ రాలేదు. ఈ నేపథ్యంలో వాటిని కేంద్రం తమకే అప్పగిస్తుందని సింగరేణి ఇంతకాలం ఎదురుచూసింది. కానీ ఈ సంస్థ అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఆ మూడింటితో పాటు పెనగడపను చేర్చింది.
ఒక బొగ్గు గనిని కొత్తగా తవ్వాలంటే అక్కడ కార్యాలయాల ఏర్పాటు, తవ్విన మట్టిని పోయడానికి అదనపు భూసేకరణ, నివాస ప్రాంతాల తరలింపు వంటి పనులకు చాలా కాలం పడుతుంది. ప్రైవేటు సంస్థలు కొత్తగా వస్తే ఈ పనులన్నీ పూర్తిచేసి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలున్నందునే తెలంగాణలో ఆ 3 గనులకు గత రెండుసార్లు టెండర్లు పిలిచినా ఏ కంపెనీ ముందుకు రాలేదు. అవే గనులను సింగరేణికి నేరుగా అప్పగిస్తే వెంటనే బొగ్గు ఉత్పత్తి సాధ్యపడుతుంది. పక్కనే ఉన్న పాత గనుల మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం వల్ల సంస్థకు లాభదాయకంగానూ ఉంటుంది. ఆ 3 గనులు సింగరేణికి అత్యంత కీలకమని, వీటిలో జీ10 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయని, ఇది తవ్వితే సంస్థకు వ్యాపారం పెరగడమే కాకుండా తెలంగాణ విద్యుత్కేంద్రాలకు సులభంగా రవాణా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. గనుల వేలం ఆపేసి నేరుగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు సింగరేణి సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.
బొగ్గు గనుల వేలం టెండర్ల ప్రక్రియపై కేంద్ర బొగ్గు శాఖ ఈ నెల 3న బెంగళూరులో నిర్వహించిన ‘పెట్టుబడిదారుల సదస్సు’కు సింగరేణి సంస్థ ఉన్నతాధికారి కూడా హాజరయ్యారు. అంటే వేలంలో పాల్గొని టెండర్లు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనందున.. వేచిచూస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?