పాత స్థలాలకు కొత్త సర్వే నంబర్లు!
పోలీస్శాఖలో అతడో సాధారణ కానిస్టేబుల్.. కానీ చేసేది మాత్రం భూదందాలు.. తాజాగా రెండు కేసుల్లో అభియోగపత్రాలు నమోదు కావడంతో అతడి నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి.
భూములను కొట్టేసేందుకు బైనంబర్ల పేరిట దందా
కానిస్టేబుల్ నేతృత్వంలో ‘రియల్’ ఆగడాలు
డీజీపీకి బాధితుల మొర.. విచారణకు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: పోలీస్శాఖలో అతడో సాధారణ కానిస్టేబుల్.. కానీ చేసేది మాత్రం భూదందాలు.. తాజాగా రెండు కేసుల్లో అభియోగపత్రాలు నమోదు కావడంతో అతడి నిర్వాకాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ బుద్వేల్లో న్యూగ్రీన్సిటీ కాలనీ కేంద్రంగా కానిస్టేబుల్ భాస్కర్రావు బృందం సాగించిన భూబాగోతమిది. హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేస్తున్న అతడు కాలనీలోని 529, 530 సర్వే నంబర్లలో సాగించిన బైనంబర్ల దందా పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం లేఅవుట్ వేసి విక్రయించిన ప్లాట్లపై వివాదాలు సృష్టించి కొట్టేసే కుయుక్తులకు ఇతడి బృందం తెరలేపింది. వాస్తవానికి కాలనీ లేఅవుట్లో ఖాళీ స్థలమేదీ లేకపోయినా భాస్కర్రావు బృందం మాత్రం రిజిస్ట్రేషన్లకు తెర లేపడం గమనార్హం. 2018లో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. బైనంబర్లు వేసి భాస్కర్రావు సొంతంగా ఓ ప్లాటును రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. మరికొన్ని ప్లాట్లను అనుచరుల పేరుతో చేయించినట్లు ఆరోపణలున్నాయి. అప్పటికే ఆయా ప్లాట్లలో యజమానులు ప్రహరీల్లాంటి నిర్మాణాలతో పొజిషన్లోనే ఉన్నా సరే భాస్కర్రావు బృందం ఈ దందాకు పాల్పడింది. అనంతరం తాపీగా న్యాయస్థానం నుంచి నోటీస్ పంపించాకే అసలు యజమానులకు భాస్కర్రావు నిర్వాకం అవగతమైంది. బాధితులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తుక్రమంలో మోసాలు బహిర్గతమై అభియోగపత్రాలు నమోదవుతున్నాయి. ముఠా ఆగడాలు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బాధితులు డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి మొర పెట్టుకోవడంతో విచారణకు ఆదేశించారు.
1997లో రిజిస్ట్రేషన్.. 2018లో కోర్టు నోటీస్
న్యూగ్రీన్సిటీ కాలనీ 529 సర్వేనంబరులో ఎర్రం రామకృష్ణారెడ్డి తన భార్య భారతి పేరిట 1997లో రిజిస్టర్డ్ సేల్డీడ్ ద్వారా 200 చదరపు గజాల స్థలం కొన్నారు. ఆ స్థలానికి 2008లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసి రుసుం చెల్లించారు. 2009లో జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి పొంది ప్రహరీ నిర్మించుకున్నారు. భాస్కర్రావు 2018లో భారతికి కోర్టు నోటీస్ పంపారు. ఆ ప్లాట్ను తాను కొనుగోలు చేశానని.. రాజేంద్రనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఆ స్థలానికి బోర్డు పెట్టేందుకు ప్రయత్నించడంతో రామకృష్ణారెడ్డి రాజేంద్రనగర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు క్రమంలో భాస్కర్రావు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా తేలడంతో ఇటీవలే అభియోగపత్రం దాఖలు చేశారు.
529లో అసలు రిజిస్ట్రేషన్.. 529/ఎతో డబుల్ రిజిస్ట్రేషన్
ఇదే కాలనీలో 529 సర్వే నంబరులో 380 నంబరు గల 200 చదరపు గజాల ప్లాట్ను డి.ఆనంద్ కుటుంబీకులు 1992లో కొనుగోలు చేసి పొజిషన్లో ఉన్నారు. 2018లో నర్సింహదాస్ కోర్టు నోటీస్ పంపారు. అదే 380 నంబరు ప్లాట్ను తాను కొనుగోలు చేశాననేది నోటీస్ సారాంశం. అయితే ఆ సర్వేనంబరు 529/ఎ, 529/ఎఎగా ఉండటంతో ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుపుతుండగానే నర్సింహదాస్తోపాటు కానిస్టేబుల్ భాస్కర్రావు బృందం ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు నర్సింహదాస్ నకిలీ సర్వే నంబరుతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించి అభియోగపత్రం దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా