29న రాష్ట్రపతి యాదాద్రి సందర్శన

తెలంగాణలో శీతాకాల విడిది కోసం ఈనెల 28న వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 29న యాదాద్రిలో పర్యటించనున్నారు.

Published : 05 Dec 2022 04:24 IST

అదే రోజు బొల్లారంలో తేనీటి విందు

ఈనాడు,హైదరాబాద్‌ : తెలంగాణలో శీతాకాల విడిది కోసం ఈనెల 28న వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 29న యాదాద్రిలో పర్యటించనున్నారు. ఆమె లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, ఉన్నతాధికారులతో కలిసి తేనీటి విందులో పాల్గొంటారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ రాక సందర్భంగా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి నిలయం అలంకరణ పనులను ప్రారంభించారు. జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ బోర్డుల పర్యవేక్షణలో రాజీవ్‌ రహదారి నుంచి హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వరకు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. రాష్ట్రపతి దిల్లీ నుంచి ఈనెల 28 ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి  చేరుకుంటారు. డిసెంబరు 30 సాయంత్రం దిల్లీకి బయలుదేరుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని