యాదాద్రిలో శిల్పకళ కళాశాల ప్రారంభం

శ్రీలక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రిలో రాష్ట్రంలోనే తొలి శిల్పకళ కళాశాల ప్రారంభమైంది. ఆదివారం ఆలయ ఈవో గీత కళాశాలలో నారసింహుడికి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులు ప్రారంభించారు.

Published : 05 Dec 2022 04:24 IST

రాష్ట్రంలోనే మొదటిది..

యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: శ్రీలక్ష్మీనరసింహుడు కొలువైన యాదాద్రిలో రాష్ట్రంలోనే తొలి శిల్పకళ కళాశాల ప్రారంభమైంది. ఆదివారం ఆలయ ఈవో గీత కళాశాలలో నారసింహుడికి, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరగతులు ప్రారంభించారు. వైటీడీఏ ఆధ్వర్యంలో కొనసాగే ఈ కళాశాలను శిల్పకళపై ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఈవో సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఈవో భాస్కర్‌, కళాశాల ప్రధానోపాధ్యాయుడు మోతీలాల్‌, ఉపాధ్యాయులు హిమాద్రి, మాగిలి, సాంస్కృతిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని