పీడీఎస్‌యూ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మూడురోజుల పాటు కొనసాగిన పీడీఎస్‌యూ 22వ రాష్ట్ర మహాసభల్లో ఆ సంఘం జిల్లాల ప్రతినిధులు పాల్గొని విద్యారంగ సమస్యలపై చర్చించారు.

Published : 05 Dec 2022 04:24 IST

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మూడురోజుల పాటు కొనసాగిన పీడీఎస్‌యూ 22వ రాష్ట్ర మహాసభల్లో ఆ సంఘం జిల్లాల ప్రతినిధులు పాల్గొని విద్యారంగ సమస్యలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పి.మహేశ్‌ (హైదరాబాద్‌), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌వీ శ్రీకాంత్‌ (సిద్దిపేట) ఎన్నికైనట్లు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అయిదుగురు, ఆరుగురు సహాయ కార్యదర్శులతో పాటు 39 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని