త్రికూట ఆలయాన్ని పరిరక్షిస్తాం

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని త్రికూట ఆలయాన్ని పరిరక్షించేందుకు చొరవ తీసుకోవాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆదివారం ట్విటర్‌ ద్వారా రాష్ట్ర పర్యాటక, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కోరారు.

Published : 05 Dec 2022 04:24 IST

ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని త్రికూట ఆలయాన్ని పరిరక్షించేందుకు చొరవ తీసుకోవాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఆదివారం ట్విటర్‌ ద్వారా రాష్ట్ర పర్యాటక, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులను కోరారు. కాకతీయుల కాలం నాటి ఈ ప్రసిద్ధ ఆలయం శిథిలావస్థకు చేరిందని. దానిని కాపాడాలని, ఒక నెటిజన్‌ మంత్రికి ట్విటర్‌ ద్వారా తెలిపారు. దీనిపై వెంటనే కేటీఆర్‌ స్పందించి, ఆలయ పునరుద్ధరణకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని